అరాచక పాలనపై పోరాడే సమయమిది
రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు.
నందమూరి బాలకృష్ణ
సభలో మాట్లాడుతున్న బాలయ్య
ఎలమంచిలి, అచ్యుతాపురం, న్యూస్టుడే: రాష్ట్రంలో అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా పొలిట్బ్యారో సభ్యుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఎలమంచిలిలో కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్కు మద్దతుగా శనివారం ఎన్నికల ప్రచార సభలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. వైకాపా నాయకుల అక్రమార్జనకు ఖనిజాలు, సముద్రాలు సైతం సరిపోవడం లేదన్నారు. సీఎం జగన్ రుషికొండకు గుండుగీసి గ్రావెల్ దోచుకున్నారన్నారు. నవరత్నాలతో ప్రజలకు నవగొయ్యిలు తీశాడని విమర్శించారు. అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, ఇప్పుడు ఆయనే మద్యం వ్యాపారం చేయిస్తున్నాడని మండిపడ్డారు. జగన్ సీఎంలా కాకుండా సైకోలా పరిపాలన సాగిస్తున్నాడని, మాస్కు అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్ను పొట్టన పెట్టుకున్నాడని గుర్తు చేశారు. జగన్ అరాచకాలను ఐదేళ్లు ఓపిగ్గా భరించామని, ఇప్పుడు ఈ అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం మాట్లాడే స్వేచ్ఛ లేకుండా చేసిందని, ఎదిరించిన వారిపై తప్పుడు కేసులు, ఎస్సీ, ఎస్టీ చట్టం కేసులు నమోదు చేసి భయాందోళన సృష్టించిందన్నారు.
మత్స్యకారులు, నిర్వాసితులను ఆదుకుంటాం
తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్లుగా అన్యాయానికి గురైన పూడిమడక మత్స్యకారులను ఆదుకుంటామని బాలయ్య హామీ ఇచ్చారు. గ్రామంలో ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తామన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) నిర్వాసితులకు తెదేపా న్యాయం చేస్తే, వైకాపా అన్యాయం చేసిందన్నారు. నిర్వాసితులకు ఉపాధి కల్పనతోపాటు వారి పెండింగ్ సమస్యలను అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. చంద్రబాబు అనుభవమంత వయసు లేని మంత్రి అమర్నాథ్ ఆయన్నే విమర్శిస్తున్నాడని బాలయ్య మండిపడ్డారు. విశాఖ సదస్సు ద్వారా ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, వచ్చిన పెట్టుబడులు ఎంత, యువతకు దక్కిన ఉపాధి ఎంత అనే విషయం అడిగితే పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన అమర్నాథ్ కోడిగుడ్డు పెట్టింది, అది పిల్లలు పెడుతుందని సామెతలు చెప్పాడన్నారు. వైకాపా నాయకుల అవినీతి వల్ల కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవి వెనక్కి పోయాయన్నారు. ఆడ, మగ తేడాలేకుండా దూషించడమే ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు విధానమన్నారు. ప్రజల ఆస్తులు కబ్జా చేయడం, అక్రమ లేఅవుట్లు వేయడం ఆయన దినచర్యని పేర్కొన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు తాతయ్యబాబు, ఎలమంచిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్కుమార్, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, సీఎం రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
రావికమతం, న్యూస్టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమిని ఆశీర్వదించి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని సినీ హీరో నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. కొత్తకోటలో శనివారం రాత్రి రోడ్డుషో నిర్వహించారు. ఆయన ప్రసంగిస్తూ.. వైకాపా ప్రభుత్వం కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్న వాటిని వెళ్లగొట్టి యువతకు ఉద్యోగాల్లేకుండా చేసిందన్నారు. ఒక రాక్షసుడి పాలనను అంతం చేసేందుకు అందరూ చేతులు కలపాలని కోరారు. చోడవరం తెదేపా అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజు, తెదేపా జిల్లా అధ్యక్షుడు తాతయ్యబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖలో జరిగిన ఆ కిడ్నాప్.. ఇప్పటికీ ఓ మిస్టరీ!
[ 18-06-2024]
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటన రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ఆ కిడ్నాప్ జరిగి ఏడాది పూర్తయింది. -
కేజీహెచ్ ఐసీయూలో పేలిన వెంటిలేటర్ బ్యాటరీ..
[ 18-06-2024]
విశాఖ కేజీహెచ్లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హఠాత్తు ఘటనతో రోగులు, సహాయకులు భయాందోళన చెందారు. -
అంతా.. మా ఇష్టం!!
[ 18-06-2024]
విశాఖ జిల్లా క్రికెట్ సంఘం (వీడీసీఏ) కార్యవర్గంలో కొందరు ఏళ్ల తరబడి పదవులు అనుభవిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. -
వైకాపా రక్తం ప్రవహిస్తున్న పోలీసులు స్వచ్ఛందంగా వెళ్లిపోండి..
[ 18-06-2024]
‘గత ప్రభుత్వంలో కొంత మంది పోలీసులు వైకాపా తొత్తులుగా పని చేశారు. ఒంటిపై ఖాకీ చొక్కాను వదిలితే వైకాపా కండువా వేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయారు. -
జగన్కు రాజమహళ్లు.. పేదలకు పునాదుల్లేని ఇళ్లు!!
[ 18-06-2024]
రుషికొండపై భవనాలకు నీళ్లలా చేసిన ఖర్చుతో సమకూర్చిన హంగులు బాహ్య ప్రపంచానికి తెలియడంతో ప్రతి ఒక్కరూ నివ్వెరపోతున్నారు. మరో వైపు... -
ప్రపంచ ర్యాంకింగ్లో విశాఖ పోర్టుకు 20వ స్థానం
[ 18-06-2024]
ప్రపంచ ర్యాంకింగ్లో విశాఖ పోర్టు అథారిటీ ఉత్తమ స్థానాలకు చేరుకుందని పోర్టు ఛైర్మన్ అంగముత్తు ఒక ప్రకటనలో తెలిపారు. -
ఉంటాయా.. కొట్టుకుపోతాయా?
[ 18-06-2024]
జగనన్న కాలనీల్లో నిర్మాణంలో ఉన్న గృహాలు వర్షాలకు కొట్టుకుపోయేలా ఉన్నాయి. ఒక సెంటు లేఅవుట్లలో విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) చేపట్టిన అభివృద్ధి పనులు విస్తుగొలుపుతున్నాయి. -
ఇక్కడేది ఆ వేగం ?
[ 18-06-2024]
గత వైకాపా ప్రభుత్వం నిర్వాకం కారణంగా రాష్ట్రానికి రైల్వేజోన్ రాకుండా పోయింది.. మరో పక్క విశాఖ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉన్నాయి. -
పాఠ్యాంశాలపై పట్టు... కొలువు ఒడిసిపట్టు
[ 18-06-2024]
పట్టుమని పద్దెనిమిదేళ్ల ప్రాయంలోనే కంపెనీల్లో కొలువులు సాధించడంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ముందుంటున్నారు. -
చేపలరేవు జెట్టీలో బోటు మునక
[ 18-06-2024]
చేపలవేటకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న బోటు (మరపడవ) సోమవారం తెల్లవారుజామున జెట్టీలో మునిగిపోయింది. -
దశలవారీగా హామీల అమలు
[ 18-06-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నానని, దశల వారీగా అమలు చేస్తానని అనకాపల్లి ఎంపీగా ఎన్నికైన సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
తప్పు చేసినా తప్పించేద్దాం
[ 18-06-2024]
అనకాపల్లిలో నకిలీ పొదుపు రుణాల కుంభకోణం నుంచి వెలుగు సిబ్బందిని బయట పడేయ డానికి డీఆర్డీఏ అధికారులు ఆరాటం చూపుతున్నారని తెలుస్తోంది. -
పాఠశాలల విలీనం జీవో రద్దు చేయాలి
[ 18-06-2024]
కూటమి ప్రభుత్వం జీవో నం. 117ను వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ డిమాండు చేశారు. -
ముంపు సమస్య నివారణకు కృషి
[ 18-06-2024]
ఎలమంచిలిలో ముంపు సమస్యను సత్వరమే పరిష్కరిస్తానని కృషి చేస్తానని ఎమ్మెల్యేగా ఎన్నికైన సుందరపు విజయ్కుమార్ హామీ ఇచ్చారు. -
బాలలందరూ బడికెళ్లేలా
[ 18-06-2024]
సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే యోచనతో ‘నేను బడికి పోతా’ వినూత్న కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. -
గంజాయి రవాణాను అడ్డుకోవాలి
[ 18-06-2024]
గంజాయి రవాణా అడ్డుకోవాలని, విచ్చలవిడిగా అమ్మకాలు సాగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. -
అమూల్.. ఢమాల్..!
[ 18-06-2024]
జగనన్న పాలవెల్లువ పేరుతో హెరిటేజ్, ఇతర సహకార డెయిరీలను దెబ్బకొట్టాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ డెయిరీల కథ ఢమాల్ అయ్యింది. వైకాపా సర్కారు అన్నీ తానై అమూల్కు మేళ్లు చేకూర్చినా పాలసేకరణలో ముందుకు వెళ్లలేకపోయింది. -
ఆంగ్లేయుల సమాధులకు రక్షణ: అయ్యన్న
[ 18-06-2024]
విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు చేతిలో హతమైన బ్రిటిష్ సైనికాధికారులు హైటర్, కవర్డ్ల సమాధుల ప్రాంత పరిరక్షణకు తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘సూపర్-8’లో మా వ్యూహం ఇదే: రవీంద్ర జడేజా
-
‘నాన్నా.. ఒక్కసారి రావా’: 9 నెలల క్రితమే అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్ మెసేజ్లు
-
ఎన్నికల ప్రక్రియపై జగన్ పోస్టు.. తెదేపా స్ట్రాంగ్ కౌంటర్!
-
వాటిని నమ్మొద్దు.. జాన్వీ సోషల్ మీడియా ఖాతాలపై టీమ్ క్లారిటీ
-
విజయవాడలో పవన్ కల్యాణ్కు ఘన స్వాగతం
-
గ్యారీ కిరిస్టెన్ ‘మాంత్రికుడు’ కాదు.. వెంటనే అద్భుతాలు జరిగిపోవు: పాక్ మాజీ క్రికెటర్