పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది.
ఎంపికైన గణపురం ఆదర్శ పాఠశాల
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత 30 పాఠశాలలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. యూడైస్ ప్లస్ ప్రోగ్రాంలో నమోదైన సమాచారం ప్రకారం జిల్లాల వారీగా పీఎంశ్రీ పథకానికి ఎంపిక ప్రక్రియ చేపట్టారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 60 రకాల ప్రశ్నావళిని పూరించారు. పాఠశాల ఫొటోలు, పంచాయతీ తీర్మాన ప్రతులను ఆన్లైన్లో నమోదు చేయాలి.. సొంత భవనం, అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ, విద్యార్థుల నమోదు, శౌచాలయాలు, తాగునీరు, చేతుల శుభ్రత, సరిపడే సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యుత్తు, గ్రంథాలయ వసతి వంటి అంశాలను అందులో నింపాలి.. దాని ఆధారంగా మొదటి విడతలో 62 బడులను ఎంపిక చేయగా, రెండో విడతలో మరికొన్ని పాఠశాలలకు అవకాశం దక్కింది.
న్యూస్టుడే, భూపాలపల్లి
ఎంపికైన బడులు ఇవీ
భూపాలపల్లి: గణపురం ఆదర్శ పాఠశాల, మహదేవపూర్ మండలం యామన్పెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
హనుమకొండ: ఆత్మకూరు మండలం అక్కంపేట ప్రాథమిక పాఠశాల, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ ఉన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ఎల్కతుర్తి, హనుమకొండ ఉన్నత పాఠశాల, కమలాపూర్ ఆదర్శ పాఠశాల, శాయంపేట మండలం చిట్యాల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికలు).
జనగామ: ఆదర్శ పాఠశాల కొడకండ్ల, లింగాలఘనపురం మండలం రత్నమాల కేసరి యూపీఎస్, ఆదర్శ పాఠశాల నర్మెట్ట, ఉన్నత పాఠశాల తరిగొప్పుల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం(బాలికలు) జఫర్గఢ్.
మహబూబాబాద్: గార్ల మండలం పెద్దకిష్టాపురం ప్రాథమిక పాఠశాల, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికలు) కేసముద్రం, ఆదర్శ పాఠశాల మహబూబాబాద్, మరిపెడ మండలం ప్రాథమిక పాఠశాల తానముచ్చర్ల, తొర్రూరు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, సీతారాంపురం ఉన్నత పాఠశాల.
ములుగు: కన్నాయిగూడెం మండలం లక్ష్మిపురం ప్రాథమిక పాఠశాల, జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, గిరిజన ఆశ్రమ పాఠశాల తాడ్వాయి, ప్రాథమిక పాఠశాల నారాయణపూర్, ప్రాథమిక పాఠశాల బెస్తగూడెం.
వరంగల్: నల్లబెల్లి మండలం నారక్కపేట ప్రాథమిక పాఠశాల, ఆదర్శ పాఠశాల నెక్కొండ, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం పర్వతగిరి, రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, వరంగల్ పట్టణంలోని నరేంద్రనగర్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల ఇల్లంద.
కొన్నింటికే అవకాశం..
పీఎంశ్రీ కింద పాఠశాలలకు ఎంపిక చేసేందుకు దరఖాస్తు చేసుకోవాలని అప్పట్లో సూచించారు. ప్రతి మండలం నుంచి రెండు పాఠశాలలను ఎంపిక చేస్తామని ప్రకటించారు. తీరా మొదటి విడతలో కొన్ని, ఇప్పుడు మరికొన్ని ఎంపిక చేశారు. మండలానికి రెండు పాఠశాలలు ఎంపికవుతాయని ఉపాధ్యాయులు, గ్రామస్థులు భావించారు. కానీ, కొన్ని మండలాల్లో బడులకు ప్రాతినిథ్యం దక్కలేదు.
రూ.లక్షల్లో నిధులు
ఎంపికైన పాఠశాలలకు నాలుగేళ్లలో రూ.లక్షల్లో నిధులు విడుదలకానున్నాయి. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు అందిస్తాయి. ఈ నిధులతో పోషకాహారవనం, శుద్ధజలం, సౌర విద్యుత్తు, ప్రయోగశాలలు, అంతర్జాల సదుపాయం, డిజిటల్ బోధన, వృత్తి విద్యా కోర్సులు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం, డిజిటల్ గ్రంథాలయం, క్రీడా మైదానం, నైపుణ్యాభివృద్ధి పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. పాఠశాల దశ నుంచే ఒకేషనల్ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చే సరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలని జాతీయ విద్యావిధానం లక్ష్యం..
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..
- కె.లక్ష్మణ్, జిల్లా విద్యాశాఖ సమన్వయ అధికారి, భూపాలపల్లి
ఎంపికైన పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ఎన్ని తరగతి గదులు అవసరం, మరుగుదొడ్లు, క్రీడా సామగ్రి, సైన్సు ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన నిధుల వివరాలను పంపిస్తాం. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపడుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా ప్రారంభమైన వైకుంఠనారాయణ స్వామి ఉత్సవాలు
[ 17-06-2024]
మండలకేంద్రమైన రాజోలిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
[ 17-06-2024]
ఇద్దరు ప్రేమికులు ఆత్మాహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బయ్యారంలోని కోటగడ్డ గ్రామంలో చోటుచేసుకుంది. -
మరిన్ని పోషకాలతో మధ్యాహ్న భోజనం
[ 17-06-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడమే కాక, బాలబాలికల శారీరక ఎదుగుదల కోసం పోషకాహారం అందించే లక్ష్యంతో సర్కారు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. -
టెండర్లు తక్కువ.. నామినేషన్ పనులెక్కువ
[ 17-06-2024]
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతున్నాయి. తమకు నచ్చిన గుత్తేదారులకు పనులు అప్పజెప్పేందుకు.. రూ.50 వేల చొప్పున విభజించి నామినేషన్ పద్ధతిలో కేటాయించారు. -
హత్యాయత్నానికి దారి తీసిన ప్రేమ వ్యవహారం
[ 17-06-2024]
యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం హత్యాయత్నానికి దారి తీసింది. యువకుడు, ఆయన తల్లిపై యువతి బంధువులు కత్తులతో దాడి చేసి గాయపర్చిన సంఘటన గీసుకొండ మండలం కీర్తినగర్కాలనీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. -
పడకేసిన ‘పలె’్ల పాలన..!
[ 17-06-2024]
గ్రామాల్లో సర్పంచుల పదవీకాలం ముగిసిపోవడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిధుల విడుదల, కేటాయింపు విషయంలో స్పష్టత లేకపోవడం, పంచాయతీల ఖాతాలు ఖాళీగా దర్శనమిస్తూ పల్లె పాలన పడకేసింది. -
సొంతింటి కల నెరవేరేనా..?
[ 17-06-2024]
ఇల్లులేని అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు గత ప్రభుత్వం మంజూరు చేసిన రెండు పడక గదుల గృహాల నిర్మాణాలపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. -
గురుకుల స్థలం.. రెండెకరాలు మాయం!
[ 17-06-2024]
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యాసంస్థలకు చెందిన రెండెకరాల భూమి విషయంలో వివాదం నెలకొంది. దశాబ్దాల కిందట అప్పటి కలెక్టర్ విద్యాసంస్థల కోసం బదలాయించిన భూమిలో కొంత భాగాన్ని కొందరు -
మందుపాతరల దండకారణ్యం..!
[ 17-06-2024]
తెలంగాణ-ఛత్తీస్గఢ్ అభయారణ్యం అట్టుడుకుతోంది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఆధిపత్య పోరుతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. వరుసగా వెలుగుచూస్తున్న మందుపాతరల ఘటనలతో గండకారణ్యంగా మారింది. -
సూడో నక్సలైట్ల ముఠా అరెస్ట్
[ 17-06-2024]
అక్రమ ఆయుధాలు కలిగి బెదిరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ చందనా దీప్తి హెచ్చరించారు. గుడిపల్లి మండలం పరిధిలోని ఘణపురం గ్రామంలో అక్రమ ఆయుధాలు కేసులో పట్టుబడిన సూడో నక్సలైట్ల ముఠాను ఆదివారం.. -
సకల వసతులు.. మెరుగైన బోధన
[ 17-06-2024]
సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి వచ్చే విద్యా సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తామని జిల్లా విద్యాశాఖ అధికారి రాంకుమార్ తెలిపారు. -
శ్రీగంధం.. ఆదాయ మార్గం
[ 17-06-2024]
పచ్చదనం పెంచేందుకు.. పర్యావరణాన్ని కాపాడేందుకు కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పథకంలో పెద్దఎత్తున మొక్కలు నాటుతోంది.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు ఖాళీ స్థలాల్లో, రహదారులకు ఇరువైపులా పెంచుతున్నారు. -
ఠాణాలు లేవు.. సిబ్బంది రారు!
[ 17-06-2024]
జనగామ మున్సిపల్ పట్టణంగా, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉంటూ 8 ఏళ్ల క్రితం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. జనగామలో దాదాపు 40 శాఖలతో జిల్లా సచివాలయం ఏర్పాటైంది. దీనికి తోడు ఈ ప్రాంతం రోజు రోజుకు విస్తరిస్తోంది. -
నెరవేరని ఓ పాలనాధికారి ఆశయం
[ 17-06-2024]
జిల్లా హోదాను సంతరించుకున్న జనగామ పట్టణాన్ని సుందరీకరించాలనే ప్రజల కోరిక, నేతల ఆకాంక్ష, అధికారుల ఆశయం నెరవేరడం లేదు. మున్సిపల్ కొత్త చట్టాన్ని అనుసరించి, పురపాలన పర్యవేక్షక బాధ్యతలు కలెక్టర్కు సంక్రమించాయి. -
కూచిపూడి నృత్య ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డు
[ 17-06-2024]
జనగామ పట్టణంలోని బతుకమ్మకుంట మైదానంలో మైత్రేయ కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆదివారం 108 మంది చిన్నారులు 15 నిమిషాల వ్యవధిలో కూచిపూడి నృత్య ప్రదర్శనతో పాటు భజగోవిందం శ్లోకాలు, -
అమ్మ చెప్పింది.. అత్తమ్మ ప్రోత్సహించింది
[ 17-06-2024]
తన విజయంలో తల్లి, అత్తయ్య ముఖ్యపాత్ర పోషించారని వరంగల్ పాలనాధికారిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన డా.సత్య శారదాదేవి అన్నారు. బాగా చదువుకోవాలని అమ్మ విజయలక్ష్మి చెప్పేది.. -
త్యాగం, సేవానిరతి అందిపుచ్చుకుందాం..!
[ 17-06-2024]
మహ్మద్ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం త్యాగ నిరతికి ప్రతీకగా ఏటా ముస్లిం సోదరులు బక్రీద్ జరుపుకొంటారు. దీనికి ఈద్-ఉల్-జుహా/ఈద్-ఉల్-అధా’ అని కూడా పేరు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ
-
‘వార్ క్యాబినెట్ రద్దు’.. యుద్ధం వేళ నెతన్యాహు కీలక నిర్ణయం!