మా సొమ్ము మా కివ్వడానికి ఇన్ని కష్టాలా?
శ్రమ.. శక్తికి మించి పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు.. అప్పుల బాధలు.. ఇలా విత్తు వేసింది మొదలు ఫలసాయం అందే వరకూ అన్నీ అవాంతరాలే. అయినా..వరి సిరులు కురిపిస్తుందని రైతన్న ఆకాంక్ష. అందుకే కష్టాలు కసిరినా.. కన్నీళ్లు
ఇంకా అందని రబీ ధాన్యం బకాయిలు
ఖరీఫ్ సాగుకు కష్టాలు
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే-భీమవరం అర్బన్, పెనుమంట్ర, దెందులూరు, ఆకివీడు
శ్రమ.. శక్తికి మించి పెట్టుబడులు.. ప్రకృతి వైపరీత్యాలు.. అప్పుల బాధలు.. ఇలా విత్తు వేసింది మొదలు ఫలసాయం అందే వరకూ అన్నీ అవాంతరాలే. అయినా..వరి సిరులు కురిపిస్తుందని రైతన్న ఆకాంక్ష. అందుకే కష్టాలు కసిరినా.. కన్నీళ్లు ముసిరినా.. విపత్తులు ఉరిమినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారు. నెలల పర్యంతం పేరుకుపోయిన బకాయిలు అన్నదాత వెన్ను విరుస్తున్నాయి. ఖరీఫ్ మధ్య దశకువచ్చినా రబీ ధాన్యం అమ్మిన సొమ్ము అక్కరకు రాక ఆర్తిగా చూస్తున్నారు.
ధాన్యం ఎగుమతి చేస్తున్న కూలీలు
ధాన్యం విక్రయించిన 48 గంటల్లో నగదు చెల్లించాలన్న నిబంధన గతంలో ఉండేది. దాన్ని వైకాపా ప్రభుత్వం 21 రోజులకు మార్చింది. క్షేత్రస్థాయిలో మాత్రం నెలలు గడిచినా అన్నదాతకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. విక్రయించిన తరువాత రెండు వారాల వరకూ చాలా చోట్ల ఆన్లైన్లో నమోదు చేయటం లేదు. నమోదు చేసిన తర్వాతైనా 21 రోజుల్లో నగదు జమవుతుందా అంటే అదీ లేదు. రబీ సీజన్ ముగిసి ఖరీఫ్ కూడా పూర్తి కావస్తున్నా సొమ్ములు రాలేదంటే పరిస్థితి అర్థమవుతోంది.
ఉమ్మడి జిల్లాలో రబీ బకాయిలు రూ.379 కోట్లు చెల్లించాల్సి ఉంది. వీరంతా 21 రోజులు దాటిన వారే. పశ్చిమగోదావరి జిల్లాలోనే రూ.249 కోట్లు బకాయిలున్నాయి. దాదాపు 10 వేల మందికి నగదు రావాల్సి ఉంది. ఏలూరులో 4వేల మంది రైతులకు రూ.130 కోట్ల బకాయిలున్నాయి. ఒకవైపు రబీకి చేసిన అప్పులు తీర్చ లేక..ఖరీఫ్కు కొత్తగా ఇచ్చేవారిని వెతుక్కుంటున్నారు. మొత్తం రుణాలకు వడ్డీలు కట్టాల్సి రావటం, మరోవైపు పాఠశాలలు మొదలు కావటంతో పిల్లల చదువులు, కుటుంబ నిర్వహణ.. ఇలా ఖర్చులు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
వలస వెళ్లిపోతాను... ‘15 ఎకరాలు వరిసాగు చేస్తున్నా. మే 6న ధాన్యాన్ని అమ్మాను. 100 రోజులు దాటినా ఇప్పటికీ నగదు చెల్లించలేదు. మొత్తం రూ.11.31 లక్షలు రావాలి. కార్యాలయాల చుట్టూ తిరిగినా ఏ అధికారిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. అప్పు చేసి ప్రస్తుతం సాగు పనులు పూర్తిచేశాను. ఇంత దారుణం ఎప్పుడూ చూడలేదు. ఇలానే కొనసాగితే పొలం అమ్ముకుని తెలంగాణకు వలస వెళ్లిపోతాను’ అని ఆకివీడుకు చెందిన కేశిరెడ్డి ప్రశాంతబాబు వాపోయారు.
సాగు విరమించాలి
- మేకల బాబ్జి, రైతు, యనమదుర్రు
పదెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాను. గడిచిన దాళ్వాకి సంబంధించి రూ.5.80లక్షలు రావాలి. నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోతే సాగు ఎలా చేయగలం. గత పంటకి సంబంధించిన తెచ్చిన అప్పులు చెల్లించే పరిస్థితి లేదు. సార్వా సాగు చేసేందుకు డబ్బులు లేవు. అందుకే ప్రస్తుత సీజన్లో సాగు విరమించుకున్నాను.
నెలలు గడుస్తున్నా సొమ్ముల ఊసే లేదు
-వి.సీ.శ్రీనివాస్, కౌలు రైతు, బ్రాహ్మణచెర్వు
మే నెలలో రబీ పంట ధాన్యం విక్రయించా. ఈ సొమ్ము రూ.5లక్షలు పైనే రావాలి. మూడు నెలలు పైనే కావస్తుంది కాని బ్యాంకులో సొమ్ము జమ కాలేదు. అప్పులు చేసి మరీ ఖరీఫ్కు పెట్టుబడులు పెట్టాం. ఈ అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ధాన్యం సొమ్ము మాత్రం రావడం లేదు. ఇదే పరిస్థితి ఉంటే ఇక సాగు చేయడం అనవసరం.
అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టా..
-ఆదిరెడ్డి సన్యాసిరావు, రైతు, పెనుమంట్ర
పంట పండించడం కంటే ధాన్యం అమ్మి సొమ్ము పొందడమే కష్టం. మూడు నెలల నాడు ధాన్యం అమ్మాను. సొంత, కౌలు భూములు సాగు చేస్తున్నా. సుమారు రూ.5 లక్షల పైబడి సొమ్ము రావాలి. కనీసం ఎవరూ సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ డబ్బు వస్తుంది కదా అని ఖరీఫ్కు అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాను.
త్వరలో జమవుతాయి
ధాన్యం బకాయిలున్న విషయం వాస్తవం. జిల్లాలో చేయాల్సిన ప్రక్రియ పూర్తి అయింది. కేంద్రం నుంచే నగదు రావాల్సి ఉంది. ధాన్యం బకాయిలు నాలుగైదు రోజుల్లో విడుదల అవుతాయి అని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ జేవి మురళి, ఏలూరు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కె.మంజుభార్గవి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!