మిథున్రెడ్డి జగత్ కంత్రీ... నల్లారి గెలిస్తే కేంద్ర మంత్రి
రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్కుమార్రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్రెడ్డిని గెలిపిస్తే జగత్కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు.
వారం రోజులు సైనికుల్లా పనిచేయండి
భాజపా నాయకులు చల్లపల్లె నరసింహారెడ్డి
మాట్లాడుతున్న భాజపా సీనియర్ నేత చల్లపల్లె నరసింహారెడ్డి
పెద్దమండ్యం, న్యూస్టుడే: రాజంపేట పార్లమెంటరీ స్థానం నుంచి ఎంపీగా నల్లారి కిరణ్కుమార్రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారు... అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారు... అదే మిథున్రెడ్డిని గెలిపిస్తే జగత్కంత్రీగా మారి మళ్లీ అవే దౌర్జన్యాలు, దోపిడీలను కొనసాగిస్తారని భాజపా సీనియర్ నాయకుడు చల్లపల్లె నరసింహారెడ్డి అన్నారు. శనివారం పెద్దమండ్యంలో భాజపా కూటమి సమావేశం తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైకాపా అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని ఓటు అనే ఆయుధంతో వారిని తరిమి వేయాలని పిలుపునిచ్చారు. పదవులున్నా లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటాం.. ఎవరూ అధైర్యపడవద్దు... మేమున్నాం కార్యకర్తలను మా ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడుకుంటాం... అని భరోసా ఇచ్చారు. దీంతో ప్రజలు కేకలు వేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డిని, ఎంపీ అభ్యర్థి కిరణ్కుమార్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. అనంతరం నల్లారి నిరూప్కుమార్రెడ్డి మాట్లాడుతూ వైకాపా నాయకులు అరాచకాలు తారాస్థాయికి చేరాయని వాటిని అరికట్టాలంటే వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. పీలేరుకు కేంద్ర బలగాలను అత్యధికగా రప్పిస్తున్నారని అందరూ స్వేచ్ఛగా ఎన్నికల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో తెదేపా, జనసేన, భాజపా మండలాధ్యక్షులు జిట్టా వెంకట్రమణ, శంకరా, లక్ష్మీనారాయణ, మాజీ మండలాధ్యక్షులు సిద్దవరం ప్రసాద్, విశ్వనాథరెడ్డి, నాయకులు నార శ్రీనివాసులు, గంగాధర్, రఘునాథయాదవ్, అస్రప్ నాగూర్, రఫీ, భానుయాదవ్, నార నాగేశ్వర్, శ్రీరాములు, రమణ, సాంబశివారెడ్డి, చిలిపి, ప్రభాకర్రెడ్డి, సిద్దవరం శ్రీనివాసులు నిమ్మా నాగేశ్వర్, కూటమి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత
[ 17-06-2024]
మండలంలోని ముద్దవారిపల్లె సమీపంలో సగిలేరు కాలువలో సోమవారం అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ ట్రాలీని అధికారులు పట్టుకున్నారు. -
భక్తిశ్రద్ధలతో బక్రీద్
[ 17-06-2024]
మండలంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. -
అయిదేళ్లూ జనం కన్నీళ్లు.. తుడవాలి చంద్రన్న వేళ్లు..!
[ 17-06-2024]
గత అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో అరాచక పాలన సాగింది. రాబందుల రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఫలితంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పంకా రెక్కలను విరిచేశారు. -
బక్రీద్ ప్రార్థనలకు ఏర్పాట్లు
[ 17-06-2024]
త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పర్వదినం సందర్భంగా కడప బిల్టప్ సమీపంలోని ఈద్గా మైదానం ముస్తాబైంది. -
డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలి
[ 17-06-2024]
మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. -
రాజముద్రతో అంగన్వాడీ పోషకాహార కిట్లు
[ 17-06-2024]
వైకాపా ప్రభుత్వం అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే పోషకాహారం వస్తువులపై అప్పటి సీఎం జగన్ ఫొటోలు ఉండేవి. -
అంతా పంచేసుకున్నారు!
[ 17-06-2024]
ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు రెవెన్యూ గ్రామంలో సర్వే సంఖ్య 659లో 89.75 ఎకరాలు, సర్వే నంబరు 661లో 1,778.28 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. -
కొత్త మంత్రిపైనే ఆశలు
[ 17-06-2024]
జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో గత మూడేళ్ల నుంచి సిబ్బంది కొరత వేధిస్తోంది. వివిధ అవసరాల నిమిత్తం వచ్చిన ఇక్కడ వచ్చే ప్రజలు పనులు నత్తనడకన సాగుతుండడంతో ఇబ్బంది పడుతున్నారు. -
ఫిర్యాదుల స్వీకరణకు అందుబాటులోకి వెబ్సైట్
[ 17-06-2024]
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వ్యవస్థల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యల ఫిర్యాదుల స్వీకరణకు చేపట్టిన కార్యక్రమాన్ని గతంలో స్పందనగా పిలిచేవారు. -
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసే జీవో 117ను రద్దుకు డిమాండు
[ 17-06-2024]
పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేందుకు గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబరు 117ను వెంటనే రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యామ్సుందర్రెడ్డి అన్నారు. -
విద్యుత్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలి
[ 17-06-2024]
విద్యుత్తు సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నివారించాలని, ఆ సంస్థల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుదర్శన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కామనూరు శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారు. -
ఉపకార వేతనం... భవితకు సోపానం
[ 17-06-2024]
తల్లిదండ్రులు పడుతున్న శ్రమను చూశారు. వారికి తమ చదువు భారం కాకూడదని భావించారు. కష్టపడి చదివి నేషనల్ మెరిట్ మీన్స్ స్కాలర్షిప్లో సత్తాచాటారు. -
తెదేపా ఫ్లెక్సీల ధ్వంసం
[ 17-06-2024]
మదనపల్లె, పెద్దమండ్యం మండలాల్లో తెదేపా నేతల పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
అన్న క్యాంటీన్ భవనాలకు మరమ్మతులు
[ 17-06-2024]
పేదల కడుపు నింపేందుకు గతంలో తెదేపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లను వైకాపా అధికారంలోకి రాగానే కక్షపూరితంగా వ్యవహరించి మూసివేసింది. -
ఆర్జేడీ, డీఈవోల అవినీతి, అక్రమాలపై విచారణ జరపండి
[ 17-06-2024]
కడప ఆర్జేడీ రాఘవరెడ్డి, డీఈవో అనూరాధ అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి మంత్రి నారా లోకేశ్కు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్?
-
వైకాపా అక్రమ కేసులపై బాగా పనిచేశారు: చంద్రబాబు ప్రశంస
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వేళ.. మణిపుర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే