Congress: కేసీఆర్ను నమ్మితే పద్మారావు మునిగినట్టే: సీఎం రేవంత్
సికింద్రాబాద్లో కాంగ్రెస్ గెలవబోతోందని, కేంద్రంలో కాంగ్రెస్ రాబోతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని.. కేంద్రంలోనూ తమ ప్రభుత్వమే రాబోతుందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘ఆనాడు దత్తాత్రేయని ఓడించి.. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్లో మూడు రంగుల జెండా ఎగరేశారు. అప్పుడు కేంద్రంలో సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మళ్లీ 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులను పునరావృతం చేయడానికి దానం నాగేందర్ 3 రంగుల జెండా ఎగరేయబోతున్నారు. దానం గెలిచి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యత నిర్వహించబోతున్నారు. భాజపా నాయకులు గెలిచి కేంద్ర మంత్రులు అయినా హైదరాబాద్కు చేసిందేమిటి? వరదలు వచ్చి హైదరాబాద్ అతలాకుతలమైతే కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డి నగరానికి చిల్లిగవ్వ తేలేదు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కాంగ్రెస్సే కారణం.
భారాస అభ్యర్థి పద్మారావు మంచోడే కానీ.. కేసీఆర్ను నమ్ముకుంటే ఆయన మునిగినట్టే. అతని పరువు తీయడానికే సికింద్రాబాద్ అభ్యర్థిగా నిలబెట్టారు. పద్మారావు నామినేషన్కు కేటీఆర్, కేసీఆర్ ఎందుకు రాలేదు? ఆయనకు వాళ్లు మద్దతు ఇవ్వడంలేదు. సికింద్రాబాద్ టికెట్ను భాజపాకు తాకట్టు పెట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు న్యాయం చేసే బాధ్యత మాది. నగరానికి కృష్ణా, గోదావరి జలాలు తెచ్చింది ఎవరో చర్చ పెడదాం.. ఇందుకు కేటీఆర్ సిద్ధమా? భారాసకు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్దే. మత సామరస్యాన్ని కాపాడింది మా పార్టీ. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడిని ప్రధాని మోదీ బజారులోకి తీసుకొచ్చారు. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో నెగ్గాలని భాజపా చూస్తోంది’’ అని రేవంత్రెడ్డి విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్లు రద్దు కావు
కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. -
పాతవి లేవు.. కొత్త పథకాలు రావు
‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. -
భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు
ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే
‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. -
ప్రజలను కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం
‘‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు తొలగించి ప్రజలందరినీ కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం. అందుకే ఓట్ల కోసం, సీట్ల కోసం రామజపం చేస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా 32,331 మంది ఓటు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్బ్యాలెట్ ద్వారా శనివారం రాత్రివరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రిజర్వేషన్లు విస్తరించిందే భాజపా: లక్ష్మణ్
‘‘ఈ ఎన్నికలు వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్నవి కాదు.. దేశం కోసం జరుగుతున్నవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు ఆచితూచి ఓటేయాలి’’ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
26 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఎన్నికల తర్వాత రేవంత్ భాజపాలోకి..
లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
పాత, కొత్త నాయకుల సమన్వయంపై దృష్టి పెట్టాలి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా పాత, కొత్త నాయకులను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సూచించింది. -
దిల్లీ పోలీసుల పేరుతో వేధింపులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దిల్లీ పోలీసుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు తమ పార్టీ ఐటీ సెల్ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిలకు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా?
తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లే
‘కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కరెంటు 24 గంటల నుంచి 11, 12 గంటలకు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లే ఆడబిడ్డలకు కిట్లు నిలిచిపోయాయి. -
రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు కోల్పోతాం
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కోల్పోతామని భారాస నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్
భారాస అధినేత కేసీఆర్ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
జిల్లాల రద్దు కాదు.. కమిషన్ ఏర్పాటు చేస్తాం
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా లేదని, న్యాయబద్ధమైన కమిషన్ వేసి దానిపై నిర్ణయం తీసుకుంటామంటూ సీఎం చెప్పారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
‘ఇండియా’ కూటమికే బీసీల మద్దతు: జాజుల
కేంద్రంలో పదేళ్ల భాజపా పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. -
సీఎం పదవికి రేవంత్ అనర్హుడు: డీకే అరుణ
సీఎం పదవికి రేవంత్రెడ్డి అనర్హుడని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. ఆదివారం రాత్రి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో భాజపా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
తెలంగాణను చూస్తుంటే బాధ కలుగుతోంది: కేసీఆర్
పేగులు తెగేదాకా కొట్లాడి తెచ్చిన తెలంగాణలో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే బాధ కలుగుతోందని, అందుకే మళ్లీ పోరాటానికి బయలుదేరానని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను భాజపా కాపాడుతుంది: అమిత్ షా
కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.