Yediyurappa: కాంగ్రెస్ గ్యారంటీలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దు: యడియూరప్ప
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్ప వ్యాఖ్యానించారు. తెలంగాణలో భాజపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన 5 గ్యారంటీలు అమలు కాలేదన్నారు. కర్ణాటక ప్రజలను మోసం చేసిన సిద్ధరామయ్య ప్రభుత్వం దివాలా దిశగా నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీ పథకాలు అంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని అన్నారు. వాటిని నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోవద్దని చెప్పారు. భాజపా అధికారంలోకి వస్తే తప్పకుండా బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని యడియూరప్ప స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం
-
సొంతగడ్డపై చెలరేగిన కోల్కతా.. దిల్లీపై ఘన విజయం
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!