విజయవాడ
విజయవాడ లోక్సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది.
లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ప్రస్తుతం దీని పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన తరువాత విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో విజయవాడ తూర్పు, మధ్య, పశ్చిమ, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు ఉన్నాయి. ఇందులో నందిగామ, తిరువూరు రిజర్వుడ్ స్థానాలు. 2022లో కొత్తగా ఎన్టీఆర్ జిల్లా ఆవిర్భవించింది.
ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 16,75,381 ఓటర్లు ఉండగా, పురుషులు 8,17,837, మహిళలు 8,57,394 ట్రాన్స్జెండర్లు 150 మంది ఓటర్ల ఉన్నారు.
2019 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్పై తెదేపా అభ్యర్థి కేశినేని నాని విజయం సాధించారు.
ప్రస్తుత ఎన్నికల్లో విజయవాడ నుంచి తెదేపా అభ్యర్థిగా కేశినేని శివనాథ్ (చిన్ని) (Kesineni Chinni) పోటీ చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో పార్టీకి విధేయంగా పనిచేస్తూ, యువగళం పాదయాత్ర లాంటి కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించిన ఆయనకు అందరూ ఊహించినట్టే టికెట్ దక్కింది. మరోవైపు, విజయవాడ సిటింగ్ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) కొన్ని నెలల కిందటే వైకాపాలో చేరారు. ఈ ఎన్నికల్లో వైకాపా విజయవాడ లోక్సభ అభ్యర్థి ఆయనే. కొన్ని నెలల కిందటి వరకూ వైకాపా అధినేత, సీఎం జగన్ను దుమ్మెత్తి పోసిన ఎంపీ నాని ఇప్పుడు ఆయన్ను కీర్తిస్తున్నారు. అమరావతి కావాలన్న ఆయన ఇప్పుడు వైకాపాకు వంతపాడుతున్నారు. మరోవైపు చిన్ని ఇవేవీ పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అన్న క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, జాబ్మేళాలతో జనంలోకి వెళ్లారు. దీంతో తాజా ఎన్నిక అన్నదమ్ముల మధ్య నువ్వానేనా అన్నట్లు ఉండటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి వల్లూరు భార్గవ్ పోటీ చేస్తున్నారు.
- ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు వీరే!
- 1952: హరిశ్చంద్ర ఛటోపాధ్యాయ(స్వతంత్ర)
- 1957: కె.అచ్చమాంబ(కాంగ్రెస్)
- 1962: కె.ఎల్.రావు(కాంగ్రెస్)
- 1967: కె.ఎల్.రావు(కాంగ్రెస్)
- 1971: కె.ఎల్.రావు(కాంగ్రెస్)
- 1977: గోడే మురహరి(కాంగ్రెస్)
- 1980: చెన్నుపాటి విద్య(కాంగ్రెస్) (ఐ)
- 1984: వడ్డే శోభనాద్రీశ్వరరావు (తెదేపా)
- 1989: చెన్నుపాటి విద్య (కాంగ్రెస్)
- 1991: వడ్డే శోభనాద్రీశ్వరరావు తెదేపా
- 1996: పర్వతనేని ఉపేంద్ర (కాంగ్రెస్)
- 1998: పర్వతనేని ఉపేంద్ర (కాంగ్రెస్)
- 1999: గద్దె రామ్మోహన్ (తెదేపా)
- 2004: లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్)
- 2009: లగడపాటి రాజగోపాల్ (కాంగ్రెస్)
- 2014: కేశినేని నాని(తెదేపా)
- 2019: కేశినేని నాని (తెదేపా)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
తిరుపతి
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి -
కర్నూలు
కర్నూలు లోక్సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్ కేటగిరీలోనే ఉంది. -
కాకినాడ
కాకినాడ లోక్సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency) జనరల్ కేటగిరిలోనే ఉంది. -
ఏలూరు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్ కేటగిరిలో ఉంది. -
రాజంపేట
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
అరకు
అరకు లోక్సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది. -
చిత్తూరు
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
అనకాపల్లి
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
గుంటూరు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్ కేటగిరీలో ఉంది. -
మచిలీపట్నం
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. -
అనంతపురం
అనంతపురం లోక్సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. -
కడప
కడప లోక్సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది. -
హిందూపురం
హిందూపురం లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. -
విశాఖపట్నం
విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
విజయనగరం
విజయనగరం లోక్సభ నియోజకవర్గం 2008లో పునర్విభజన సమయంలో ఏర్పడింది. -
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని ఏకైక లోక్సభ నియోజకవర్గం (Srikakulam Lok Sabha constituency) ఇది. 1952లో ఏర్పాటైన ఈ స్థానం జనరల్ కేటగిరిలో ఉంది. -
నరసాపురం
నరసాపురం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరి స్థానం. -
అమలాపురం
అమలాపురం లోక్సభ నియోజకవర్గం (Amalapuram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. -
ఒంగోలు
ఒంగోలు లోక్సభ నియోజకవర్గం (Ongole Lok Sabha constituency)1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరి.
తాజా వార్తలు
-
మూడు రోజుల వరుస లాభాలకు విరామం.. నష్టాల్లో సూచీలు
-
14 నెలల క్రితమే గుర్తించినా.. 14 మంది ప్రాణాలు పోయే వరకు..
-
జేసీ ప్రభాకర్రెడ్డికి అస్వస్థత.. సికింద్రాబాద్ కిమ్స్లో చికిత్స
-
రఫాలో మాజీ సైన్యాధికారి మృతి.. భారత్కు ఐరాస క్షమాపణలు
-
400 సీట్లు గెలిస్తే.. భారత్లో పీవోకే విలీనం ఖాయం: హిమంత బిశ్వశర్మ
-
తుపాకీతో కాల్చుకొని.. సచిన్ సెక్యూరిటీగార్డు ఆత్మహత్య..!