TS Elections: భారాస, బీఎస్పీ కార్యకర్తల మధ్య తోపులాట.. కాగజ్నగర్లో ఉద్రిక్తత
కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
కాగజ్నగర్: కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగజ్నగర్లోని విజయ బస్తీలో ఆదివారం బీఎస్పీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడికి భారీ శబ్దాలతో భారాస ప్రచార వాహనం వచ్చింది. దీంతో భారాస, బీఎస్పీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పాటల శబ్దం తగ్గించాలని కోరినా భారాస కార్యకర్తలు పట్టించుకోలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. భారాస కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాగజ్నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!