icon icon icon
icon icon icon

TS Elections: భారాస, బీఎస్పీ కార్యకర్తల మధ్య తోపులాట.. కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత

కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 

Published : 13 Nov 2023 02:06 IST

కాగజ్‌నగర్‌: కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగజ్‌నగర్‌లోని విజయ బస్తీలో ఆదివారం బీఎస్పీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ క్రమంలోనే అక్కడికి భారీ శబ్దాలతో భారాస ప్రచార వాహనం వచ్చింది. దీంతో భారాస, బీఎస్పీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. పాటల శబ్దం తగ్గించాలని కోరినా భారాస కార్యకర్తలు పట్టించుకోలేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ ఆరోపించారు. భారాస కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ కాగజ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img