మోదీకి ఓటమి భయం
ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే మతాల మధ్య చిచ్చుపెట్టేలా.. అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు.
అందుకే మతచిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు
ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలికా?!
ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం
భాజపా కోసం కేసీఆర్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు
నిజామాబాద్, ఆదిలాబాద్, అంతాయిపల్లి సభల్లో సీఎం రేవంత్రెడ్డి
ఓట్ల కోసం రాముడిని రోడ్లపైకి తీసుకురావడం మోదీకే చెల్లింది. రాముడు మాకు కూడా దేవుడే. మా ఇంట్లోనూ ఆయనతో పాటు ఇతర దేవుళ్లను పూజిస్తాం. దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి. నేను హిందువుగా గర్విస్తా. ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తా. మతం పేరిట విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాడుతోంది.
-సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు-నిజామాబాద్, హైదరాబాద్, ఈటీవీ-ఆదిలాబాద్, శామీర్పేట, జవహర్నగర్-న్యూస్టుడే: ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే మతాల మధ్య చిచ్చుపెట్టేలా.. అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దేశానికి మంచిది కాదన్నారు. రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. కాంగ్రెస్ గెలిస్తే ప్రజల సంపదనంతా ముస్లింలకు పంచుతుందంటూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. అక్రమంగా ఎవరైనా ఆస్తులు రాయించుకుంటే శిక్షించేందుకు చట్టాలున్నాయని పేర్కొన్నారు. ఓ వర్గం ఆస్తిని ఇతర వర్గాల వారికి ఎలా పంచుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అన్న విషయాన్ని మరవొద్దన్నారు. ఆయన సోమవారం నిజామాబాద్, ఆదిలాబాద్లతో పాటు మల్కాజిగిరి నియోజకవర్గంలోని శామీర్పేట మండలం అంతాయిపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభల్లో ప్రసంగించారు. ‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ల పాలనలో పేదలు, మహిళలు, యువత ఆశలు నెరవేరలేదు. ఆదివాసీలు, గిరిజనులు, నిరుద్యోగుల గోడును వారు పట్టించుకోలేదు. పదేళ్లలో దేశాన్ని నరేంద్ర మోదీ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. ప్రపంచంలో ఆకలి, ఆకలిచావులు ఎక్కువగా ఉన్న దేశాలపై నిర్వహించిన సర్వే ర్యాంకింగ్లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ల కంటే భారత్ దిగువన ఉండేదా?రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లోని హామీల్లో అయిదింటిని అమలు చేశాం. 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. పేదల ఇళ్లలో వెలుగులు చూసిన కేసీఆర్, మోదీలు.. తమ కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. ఉచిత కరెంటు ఆపాలని, కాంగ్రెస్ను ఓడించాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని పథకాలు పన్నుతున్నారు. ఆదిలాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలవకపోతే గ్యారంటీ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. దిల్లీ మద్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న తన కుమార్తె కవిత బెయిల్ కోసం భాజపాతో మాజీ సీఎం కేసీఆర్ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో భాజపా అభ్యర్థులను గెలిపించేందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.
బాసర సరస్వతీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా..
రుణమాఫీపై ప్రతిపక్షాలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. బాసర సరస్వతీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాదే. నల్లచట్టాలపై పోరాటం చేసి ప్రధానితో క్షమాపణ చెప్పించిన ఘనత హరియాణా, పంజాబ్ రైతులది. అదే తరహా పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవం నిజామాబాద్ ప్రాంత రైతుల్లో ఉంది. గతంలో పసుపు బోర్డు, నిజాం చక్కెర కర్మాగారంపై హామీలిచ్చి విస్మరించిన కేసీఆర్ కుమార్తె కవితను ఓడించారు. ఇదే తరహాలో బాండ్ పేపర్ రాసిచ్చి పసుపు, ఎర్రజొన్న రైతులను మోసగించిన భాజపా ఎంపీని కూడా ఓడించాలి. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, స్వయంగా రైతు అయిన నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిని గెలిపించాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. అధిష్ఠానాన్ని ఒప్పించి జీవన్రెడ్డిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని చేయించే బాధ్యత తీసుకుంటాను. సెప్టెంబరు 17 నాటికి నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం.
ఒక్కోసారి ఓటమి కూడా మంచే చేస్తుంది
ఒక్కోసారి ఓటమి కూడా మంచే చేస్తుంది. 2018 ఎన్నికల్లో నన్ను కక్షపూరితంగా వ్యవహరించి ఓడించారు. కానీ, ఆ తర్వాత నాలుగు నెలల్లోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లున్న మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని నన్ను రాహుల్ గాంధీ ఆదేశించారు. 30 లక్షల మందికి పైగా ఓటర్లున్న నియోజకవర్గంలో.. ప్రశ్నించే గొంతుక అవసరమని గ్రహించిన ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుంటే ఎంపీగా అవకాశం వచ్చేది కాదు. అధిష్ఠానం నా ప్రతిభను చూసి పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.
లోక్సభ ఎన్నికల అనంతరం తెల్ల రేషన్కార్డులు
లోక్సభ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ తెల్ల రేషన్కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వనుంది. మల్కాజిగిరిలో పట్నం సునీతా మహేందర్రెడ్డి గెలుపు ప్రకటన మరుక్షణం ఇక్కడి నుంచే తెల్ల రేషన్కార్డుల జారీ ప్రకటన చేస్తాం. ఎంపీగా సునీత గెలిస్తే.. పట్నం మహేందర్రెడ్డిని ప్రభుత్వ విప్గా నియమిస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారని చెప్పే ఈటల.. కేసీఆర్, కేటీఆర్ల అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ చర్యలను కమ్యూనిస్టునని చెప్పుకొనే భాజపా మల్కాజిగిరి అభ్యర్థి ఈటల ఎలా సమర్థిస్తారు?
ఆదిలాబాద్లో వర్సిటీ ఏర్పాటు చేస్తాం
ఆదిలాబాద్లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. మూతపడిన సిమెంటు పరిశ్రమను ప్రైవేటు భాగస్వామ్యంతోనైనా తిరిగి తెరిపిస్తాం. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తాం. బోథ్ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. ఆ సర్కారును ఒప్పించి.. అక్కడి ముంపు రైతులకు పరిహారం ఇప్పిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తాం. ఆ ప్రాజెక్టుకు మళ్లీ అంబేడ్కర్ పేరు పెడతాం. మేడ్చల్, శామీర్పేట్లలో ఐటీ, ఫార్మా సంస్థలు ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సభల్లో లోక్సభ అభ్యర్థులు టి.జీవన్రెడ్డి(నిజామాబాద్), ఆత్రం సుగుణ(ఆదిలాబాద్), పట్నం సునీతా మహేందర్రెడ్డి (మల్కాజిగిరి), మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క, ఎమ్మెల్సీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మణ్కుమార్, వెడ్మ బొజ్జు, జి.వినోద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి, కాంగ్రెస్ నేతలు మధుయాస్కీ, మండవ వెంకటేశ్వరరావు, వేణుగోపాలాచారి, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, ఎం.సుధీర్రెడ్డి, వజ్రేశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం సభా స్థలంలో డ్రోన్ కలకలం.. ముగ్గురిపై కేసు
ఈనాడు, హైదరాబాద్: అంతాయిపల్లిలో ఎన్నికల సభకు సీఎం రేవంత్రెడ్డి వెళ్లిన సమయంలో డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. సీఎం ప్రయాణించిన హెలికాప్టర్ హెలిప్యాడ్లో ల్యాండ్ అయిన తర్వాత ఒక్కసారిగా డ్రోన్ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అప్పటికే సీఎం హెలికాప్టర్ నుంచి కిందకు దిగారు. డ్రోన్ను ఆపరేట్ చేస్తున్న ముగ్గుర్ని బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎండీ ఇద్రిస్, గణేశ్రెడ్డి, అక్షయ్గా గుర్తించారు. డ్రోన్ను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి మీడియా బృందంలోని సభ్యులని వారు చెప్పినట్లు తెలిసింది. హెలికాప్టర్ ల్యాండయ్యే సమయంలో డ్రోన్ను ఎగరేయడం నిబంధనలకు విరుద్ధం. ముగ్గురు నిందితులనూ శామీర్పేట ఠాణాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన