కాంగ్రెస్కే సవాల్!
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది.
కొన్నైనా గెలవాలని గట్టి ప్రయత్నం
పట్టు నిలుపుకోవాలని కమలదళం
7న ఛత్తీస్గఢ్లో చివరి విడత పోలింగ్
గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో పెద్దగా విజయాలు సాధించని ఆ పార్టీ ఈసారి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది. మరోవైపు గత వైభవాన్ని కొనసాగించాలని భాజపా తలపోస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 11 నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 చోట్ల పోలింగ్ పూర్తయింది. మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన 7 చోట్ల పోలింగ్ జరగనుంది.
- మూడో విడతలోని 7 నియోజకవర్గాల బరిలో మొత్తం 168 మంది నిలిచారు. వారిలో 142 మంది పురుషులు, 26 మంది మహిళలు.
- ఈసారి పోటీ పడుతున్న వారిలో సంపన్న నేతల సతీమణులు ఉన్నారు. వారివద్ద కిలోల కొద్దీ బంగారం ఉన్నట్లు అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది.
- అభ్యర్థుల్లో భారీగా అప్పులు ఉన్నవారూ ఉన్నారు.
- ఛత్తీస్గఢ్లో మోదీ, అమిత్ షాతోపాటు రాహుల్ గాంధీ ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు.
- మూడో విడత పోలింగ్లో వీఐపీ నియోజకవర్గాలైన రాయ్పుర్, దుర్గ్, కోర్బా వంటివి ఉన్నాయి.
- ఛత్తీస్గఢ్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భాజపాల మధ్యే నేరుగా పోరాటం సాగుతోంది. ఒక్క కోర్బాలోనే గోండ్వానా గోమంతక్ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు.
- 2004, 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 సీట్లలో 10 స్థానాలను భాజపా గెలుచుకుంది. మూడు సార్లు ఒక సీటుకే కాంగ్రెస్ పరిమితమైంది.
- 2019లో భాజపా 9 చోట్ల గెలిచింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించింది.
- అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే జాంజ్గీర్, బిలాస్పుర్, కోర్బా, రాయ్గఢ్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ బలంగా ఉంది.
కమలదళ ‘రాజధాని’
రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం రాయ్పుర్. గతంలో ఇక్కడ కాంగ్రెస్ హవా కొనసాగేది. 1989 నుంచి భాజపా గెలుస్తూ వస్తోంది. మధ్యలో 1991లో ఒకసారి కాంగ్రెస్ గెలిచింది. ఈ సారి ఛత్తీస్గఢ్ చాణక్యుడిగా పేరుగాంచిన సీనియర్ నేత, 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బ్రిజ్మోహన్ అగర్వాల్ను భాజపా నిలిపింది. ఆయనపై యువ సంచలనం వికాస్ ఉపాధ్యాయ్ను కాంగ్రెస్ బరిలోకి దింపింది. 2018 ఎన్నికల్లో వికాస్.. భాజపా సీనియర్ నేతను ఓడించారు. ఖనిజాలకు ఆలవాలమైన రాయ్పుర్ ఒకప్పుడు కుగ్రామం. క్రమంగా రాజధానిగా ఎదిగింది. రాయ్పుర్లో స్టీల్ పరిశ్రమ కార్మికులు అధికంగా ఉంటారు. ఇక్కడ 200 స్టీల్ రోలింగ్, 195 స్పాంజ్ ఐరన్, 6 స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి.
ఇక్కడ 3,63,000 మంది ఎస్సీలు, 1.28 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 9.81 లక్షల మంది ఉన్నారు. పట్టణ ఓటర్లు 11.29 లక్షల మంది ఉన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లే విజేతను నిర్ణయిస్తారు.
అటోసారి.. ఇటోసారి
దుర్గ్ లోక్సభ సీట్లో విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయాలు సాధించినా లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి చతికిలపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘెల్ సొంత జిల్లా అయిన దుర్గ్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లకుగానూ కాంగ్రెస్ 8 గెలుచుకుంది. భాజపాకు ఒక్క సీటే దక్కింది. జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి మోదీ ప్రభావం కనిపిస్తోంది. ఈసారీ కాంగ్రెస్కు విజయం అంత సులువుగా లేదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా గెలవలేదు. ఈసారి దుర్గ్లో భాజపా తరఫున సిటింగ్ ఎంపీ విజయ్ బఘెల్, కాంగ్రెస్ తరఫున రాజేంద్ర సాహు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 20,72,643 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో భాజపాకు 61 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 32 శాతం ఓట్లే దక్కాయి. గత ఎంపీ చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలిగారు.
పోటాపోటీగా జాంజ్గీర్
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జాంజ్గీర్లో ఈసారి పోటీ గట్టిగానే ఉంది. గత ఎన్నికల్లో భాజపా 80,000కుపైగా ఓట్లతో గెలిచింది. ఈసారి భాజపా నుంచి కమలేశ్ జాంగడే, కాంగ్రెస్ నుంచి శివ్ కుమార్ డహ్రియా తలపడుతున్నారు. ఇక్కడ 20,44,411 ఓట్లున్నాయి. ఛత్తీస్గఢ్లో రాహుల్ జోడో యాత్ర జాంజ్గీర్ నుంచే ప్రారంభమైంది. దీంతో ఈ సీటుపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. దళితులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
గిరిజన ప్రాబల్య సర్గుజా
గిరిజనులు అధికంగా ఉన్న సర్గుజా భాజపాకు సంద్రాయంగా అండగా నిలుస్తోంది. ఇది ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. ఈసారి ఇక్కడి నుంచి భాజపా తరఫున చింతామణి మహారాజ్, కాంగ్రెస్ తరఫున శశి సింగ్ బరిలో నిలిచారు. చింతామణి రంగంలోకి దిగడంతో కాంగ్రెస్కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయన 2023లో కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరారు. శశి సింగ్ యువ నాయకురాలు. క్షేత్ర స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ 18,12,901 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిసారీ భాజపా, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లు తలపడతాయి.
చివరకు భాజపాను విజయం వరిస్తుంది. ఈ సారి గతానికి భిన్నంగా గట్టి పోటీ ఉంది. ఇక్కడ భాజపా కన్వర్ వర్గానికి టికెట్ ఇస్తుంటుంది. గత ఎన్నికల్లో గోండ్ వర్గానికి చెందిన రేణుకా సింగ్కు టికెట్ ఇచ్చింది. అయినా భాజపా గెలిచింది. ఇక్కడ గోండ్ వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉంటారు. ఈసారి కాంగ్రెస్ గోండ్ వర్గానికి చెందిన శశి సింగ్ను నిలిపింది.
భాజపాదే పైచేయి
రాష్ట్రంలో ముఖ్యమైన నియోజకవర్గమైన బిలాస్పుర్లో భాజపాదే పైచేయి. ఈసారి భాజపా నుంచి తోఖన్ సాహు, కాంగ్రెస్ నుంచి దేవేంద్ర యాదవ్ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన భాజపా నేత అరుణ్ సావో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవేంద్ర యాదవ్ దేశంలోనే అతి పిన్న వయసులో (25ఏళ్లకే) మేయరుగా ఎన్నికయ్యారు. బిలాస్పుర్లో 18,11,606 మంది ఓటర్లున్నారు. అరుణ్ సావో ఎంపీగా తానిచ్చిన హామీలను అమలు చేశారు. నియోజకవర్గాన్ని తరచూ సందర్శించేవారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఉన్నత పాఠశాలల కోసం కొన్ని గ్రామాలు విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ వెళ్లాల్సి వస్తోంది.
పోటాపోటీ
ఛత్తీస్గఢ్లోని కీలక నియోజకవర్గాల్లో రాయ్గఢ్ ఒకటి. ఇది ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. గత ఏడు లోక్సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి రాధేశ్యాం రాఠియా, కాంగ్రెస్ నుంచి మనేకా దేవీ సింగ్ పోటీ చేస్తున్నారు. మనేకా రాజ కుటుంబం నుంచి వచ్చారు. దీంతో ఈ సారి గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ 18,29,038 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం రెండు పార్టీలు సమాన బలంతో ఉన్నాయి.
కాంగ్రెస్ కోట కోర్బా
కాంగ్రెస్కు పట్టున్న నియోజకవర్గం కోర్బా. డీలిమిటేషన్ తర్వాత ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2014 మినహా అన్నిసార్లు కాంగ్రెస్ గెలుస్తూ వస్తోంది. ఈసారి భాజపా నుంచి సరోజ్ పాండే, కాంగ్రెస్ నుంచి జ్యోత్స్న మహంత్ పోటీ చేస్తున్నారు. ఇక్కడ 13,40,544 ఓట్లు ఉన్నాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?
-
ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
-
ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు.. 748 కేంద్రాల్లో 91 శాతానికి పైగా నమోదు
-
అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు
-
తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్ కోర్టు తీర్పు