పునర్విభజనే ఫలితాల నిర్ణేత!
ఈశాన్య రాష్ట్రాల పెద్దన్న అస్సాంలోని 4 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది.
బంగ్లాదేశీ ముస్లింల ఓట్ల విభజనతో లబ్ధికి భాజపా యత్నం
7న అస్సాంలోని 4 నియోజకవర్గాల్లో పోలింగ్
ఈశాన్య రాష్ట్రాల పెద్దన్న అస్సాంలోని 4 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. కోకరాఝార్, బర్పేటా, ధుబరీ, గువాహటిలలో జరగనున్న ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనే (డీలిమిటేషన్) ఫలితాలను శాసించనుంది. పునర్విభజన తర్వాత జరగనున్న తొలి లోక్సభ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ఈ విడతలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోకరాఝార్లో 12 మంది, బర్పేటాలో 14 మంది, ధుబరీలో 13 మంది, గువాహటిలో 8 మంది బరిలో ఉన్నారు.
- పునర్విభజనతోపాటు జాతీయ పౌర రిజిస్టరు (ఎన్ఆర్సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), సంశయాత్మక ఓటర్లు (డి ఓటర్లు), నిర్బంధ శిబిరాలు, బెంగాలీల అంశాలు ఇక్కడ ప్రభావం చూపనున్నాయి.
- నాలుగు చోట్లా ఎన్డీయే, ఇండియా కూటములు పోటీ చేస్తున్నాయి. గువాహటిలో రెండు పార్టీలూ మహిళలకు టికెట్లు ఇచ్చాయి.
- బర్పేటా, ధుబరీలో భాజపా భాగస్వామి అస్సాం గణ పరిషత్ (ఏజీపీ) పోటీ చేస్తోంది.
- యూపీపీఎల్ కోకరాఝార్లో బరిలోకి దిగింది.
- ధుబరీ నుంచి ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ పోటీ చేస్తున్నారు.
- బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, సీపీఎం కూడా మూడో విడతలో పోటీ చేస్తున్నాయి.
ధుబరీ
బంగ్లాదేశ్ వలస ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ధుబరీ. ఇక్కడ ఏజీపీ పోటీ చేస్తోంది. ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్ ఇక్కడ సిటింగ్ ఎంపీ. ఆయన మూడు దఫాలుగా ఇక్కడ గెలుస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ కూడా పోటీ చేస్తోంది. దీంతో ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 26 లక్షల మంది ఓటర్లున్నారు. డీలిమిటేషన్ తర్వాతా ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.
ఇక్కడ ప్రధాన పోటీ ఏఐయూడీఎఫ్, కాంగ్రెస్ మధ్య ఉండే అవకాశముంది.
చెల్లని సిటింగ్ ఎంపీ నామినేషన్
గత రెండు లోక్సభ ఎన్నికల్లో కోకరాఝార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నబా సరానియా నామినేషన్ను చెల్లదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఆయన ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో మళ్లీ ఆయన కోర్టును ఆశ్రయించారు.
కోకరాఝార్
గత రెండు ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గమైన కోకరాఝార్ నుంచి గెలిచిన నబా సరానియా అస్సాం రాజకీయాల్లో కీలక నేత. ఒకప్పుడు ఉల్ఫాలో కమాండర్గా ఉన్న ఆయన ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి గెలిచి నిలిచారు. గణ సురక్ష పరిషత్ పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. ఈ పార్టీ భాజపాతోగానీ, కాంగ్రెస్తోగానీ కలవలేదు. సరానియా ప్రస్తుతం తన ఎస్టీ హోదాపై కోర్టుల్లో పోరాడుతున్నారు.
ఇక్కడ భాజపాయేతర పార్టీలే బలంగా ఉన్నాయి.
గువాహటి
బంగ్లాదేశీ ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గువాహటి కూడా ఒకటి. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. డీలిమిటేషన్కు ముందు ఇది భాజపాకు అండగా నిలిచింది.
బర్పేటా
గతంలో బంగ్లాదేశీ వలస ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గం బర్పేటా. డీలిమిటేషన్తో ఇక్కడ హిందూ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడ ఎన్డీయే నుంచి ఏజీపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్, సీపీఎం బరిలో ఉన్నాయి.
- ముస్లింలు 70 శాతం నుంచి 80శాతందాకా ఉండే 3 అసెంబ్లీ నియోజకవర్గాలను బర్పేటా నుంచి తీసుకెళ్లి ధుబరీలో కలిపారు.
- సహజంగా భాజపా-ఏజీపీలకు మద్దతుగా నిలిచే అస్సామీలు అధికంగా ఉండే రెండు నియోజకవర్గాలను తీసుకొచ్చి బర్పేటాలో విలీనం చేశారు.
- ఈ మార్పులతోపాటు కాంగ్రెస్, ఏఐయూడీఎఫ్ల మధ్య ఓట్లు చీలి తమకు లాభం కలుగుతుందనేది భాజపా భావనగా ఉంది. అయితే భాజపాయేతర పార్టీలకే ఇది అనుకూలంగా ఉండే అవకాశముంది.
భాజపాకు పరీక్షే
తొలి, రెండో విడతల్లో తమకు అనుకూలంగానే పోలింగ్ జరిగిందని భావిస్తున్న భాజపా మూడో విడతలో గట్టి పరీక్షనే ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాలు ఏం చేస్తాయనే ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాలు ఆ తరువాత ఏఐయూడీఎఫ్ అధినేత బద్రుద్దీన్ అజ్మల్కు మద్దతుగా నిలిచాయి. అయితే భాజపా వాటిని వదులు కోవడం లేదు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ప్రాంతాల్లో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. బాల్య వివాహాలపై నిషేధం వంటి అంశాలద్వారా వలస ముస్లిం మహిళలు తమకు మద్దతిస్తారని ఆయన ఆశాభావంతో ఉన్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే