పట్టు కోల్పోతున్న వారసత్వం?
కీలక నియోజకవర్గాల్లో వారసత్వం పట్టు కోల్పోతుందా? దశాబ్దాలుగా కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట పోటీకి వారసులు దూరంగా జరగడం దేనికి సంకేతం?
కుటుంబ నియోజకవర్గాల్లో పోటీకి దూరం
కొన్నిచోట్ల సవాల్గా తీసుకుని బరిలోకి..
కీలక నియోజకవర్గాల్లో వారసత్వం పట్టు కోల్పోతుందా? దశాబ్దాలుగా కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట పోటీకి వారసులు దూరంగా జరగడం దేనికి సంకేతం? మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వాస్తవాలు వారిని భయపెడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తమ కుటుంబాల నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఈసారి వారసులు బరిలోకి దిగడం లేదు. అందులో ఉత్తర్ ప్రదేశ్లోని అమేఠీ, బాగ్పత్, పీలీభీత్, ఝార్ఖండ్లోని హజారీబాగ్ వంటి నియోజకవర్గాలున్నాయి. ఇందులో రాహుల్ గాంధీ, జయంత్ చౌధరి స్వచ్ఛందంగా సీట్లను వదులుకోగా.. వరుణ్ గాంధీ, జయంత్ సిన్హాలకు భాజపా టికెట్లు ఇవ్వలేదు.
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ గత 25 ఏళ్లలో తొలిసారిగా గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యుల్లేకుండా ఎన్నికలకు వెళ్తోంది. 2004 నుంచి 2014 వరకూ ఇక్కడ గెలుస్తూ వచ్చిన రాహుల్ గాంధీ 2019లో ఓడిపోయారు. దీంతో ఈసారి ఆయన తన తల్లి ఖాళీ చేసిన రాయ్బరేలీకి మారారు. తమ కుటుంబానికి సన్నిహితుడైన కిశోరీలాల్ శర్మను అమేఠీలో బరిలోకి దించారు.
మాజీ ప్రధాని చరణ్ సింగ్ మనవడు, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌధరి బాగ్పత్ నుంచి ఈసారి పోటీ చేయడం లేదు. తన తాత, తండ్రి అజిత్ సింగ్ గెలిచిన ఈ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
హజారీబాగ్కు భాజపా మాజీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తరువాత ఆయన కుమారుడు జయంత్ సిన్హా అక్కడి నుంచి గెలిచారు. ఈసారి ఆయనకూ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఈ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి పట్టు తప్పింది.
పీలీభీత్ మేనకా గాంధీ, వరుణ్ గాంధీలకు కంచుకోట. ఈసారి భాజపా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో 3 దశాబ్దాల్లో వారు పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి.
మళ్లీ నిలిచిన నేతలు
కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్లది మరో తీరు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో తమ కంచుకోటల్లో మళ్లీ బరిలోకి దిగారు. 2019లో దిగ్విజయ్ మధ్యప్రదేశ్లోని భోపాల్లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి తమ సొంత నియోజకవర్గం రాజ్గఢ్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులే చాలాకాలంపాటు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఈ సీటును పోగొట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు దిగ్విజయ్ బరిలో నిలిచి పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.
ఉత్తర్ప్రదేశ్లోని కన్నౌజ్లో 2019 ఎన్నికల్లో డింపుల్ యాదవ్ ఓటమి పాలయ్యారు. అది సమాజ్వాదీకి కంచుకోట. 1999 వరకూ అక్కడ ములాయం కుటుంబ సభ్యులే గెలిచారు. ఆ తర్వాత భాజపా వశమైంది. మళ్లీ ఇప్పుడు పట్టు సాధించేందుకు స్వయంగా అఖిలేశ్ రంగంలోకి దిగారు.
తమ కుటుంబానికి పెట్టని కోట అయిన మధ్యప్రదేశ్లోని గుణలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2019లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన భాజపా తరఫున అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని పట్టు నిలబెట్టుకోవాలనేది ఆయన లక్ష్యం.
హిమాచల్ ప్రదేశ్లోని మండీలో విక్రమాదిత్య సింగ్ పోటీకి దిగారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన తమ కుటుంబానికి ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టును కాపాడుకోవాలని తలపోస్తున్నారు. ఇక్కడ భాజపా తరఫున సినీ నటి కంగనా రనౌత్ పోటీలో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని కడపలో పట్టు కోసం కుటుంబ సభ్యుల మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి షర్మిల, వైకాపా నుంచి అవినాశ్ రెడ్డి తలపడుతున్నారు. ఈ సీటుకు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహించారు.
మహారాష్ట్రలోని బారామతిలో కుటుంబ సభ్యుల మధ్యే పోరు సాగుతోంది. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ మధ్య తీవ్ర పోటీ సాగుతోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు