icon icon icon
icon icon icon

Ts Elections: సీఎం కేసీఆర్‌ సమక్షంలో.. భారాసలో చేరిన కాంగ్రెస్‌ నేతలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు.

Published : 10 Nov 2023 19:51 IST

హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ పార్టీ నేతలు భారత్‌ రాష్ట్ర సమితి (భారాస)లో చేరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో వారు  పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి భారాసలో చేరారు. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ, మానవతారాయ్‌, వెంకట్‌గౌడ్‌, అబ్బయ్య దంపతులు, రామచంద్రు నాయక్‌ తదితరులకు సీఎం కేసీఆర్‌ భారాస కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 13న దమ్మపేటలో జరగనున్న కేసీఆర్ సభలో.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు భారాసలో చేరనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img