KTR: హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం: కేటీఆర్
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకొనే శక్తి భారాసకే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
వేములవాడ: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకొనే శక్తి భారాసకే ఉందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వేములవాడ నియోజకవర్గం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్తో పాటు కేటీఆర్ పాల్గొన్నారు.‘‘2014లో బడా భాయి మోసం చేసి ఓట్లు దండుకున్నారు. జన్ధన్ ఖాతాలు తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15లక్షలు ఖాతాలో వేస్తామని ఓట్లు వేయించుకున్నారు. 2024లో ఆరు గ్యారంటీలు ఇస్తామని చోటా భాయి మోసం చేశారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ.. పదేళ్లలో ప్రజలను మోసం చేశారు. డీజిల్, పెట్రోల్ సహా నిత్యావసరాల ధరలు పెంచేశారు. రహదారుల నిర్మాణం కోసం సెస్ వసూలు చేసిన మోదీ.. మళ్లీ ఇప్పుడు టోల్ రుసుము పేరుతో ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలి. అలా రూ.30లక్షల కోట్లు వసూలు చేసి .. అందులో నుంచి రూ.14.50 లక్షల కోట్లు అదానీ, అంబానీ లాంటి వారందరి రుణాలన్నీ మాఫీ చేశారు.
కరీంనగర్లో భాజపా, భారాస మధ్యే పోటీ. ఎందుకంటే టికెట్ విషయంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. కాంగ్రెస్ పార్లమెంట్ టికెట్ను ప్రవీణ్రెడ్డి, జీవన్రెడ్డి ఆశించారు. కానీ, వారిద్దరిలో ఎవరికి ఇచ్చినా గట్టి పోటీ ఉంటుందని, ఇదే జరిగితే వినోద్ బయట పడతాడన్న ఉద్దేశంతో ముక్కు ముఖం తెలియని వ్యక్తిని నిలబెట్టారు. రేవంత్రెడ్డి, బండి సంజయ్ మ్యాచ్ ఫిక్సింగ్లో కరీంనగర్కు డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో 10.. 12 ఎంపీ సీట్లు భారాసకు వస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలోపే వస్తుంది. 70 ఏళ్ల వయసులో తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా, నమ్మినవాళ్లు మోసం చేసి వేరే పార్టీల్లోకి వెళ్తున్నా.. కేసీఆర్ బస్సుయాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు. తల్లిలాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయతీలు పక్కన పెట్టి ఎండను లెక్క చేయకుండా ముందుకు రావాలి’’ అని కేటీఆర్ కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల విధులకు గైర్హాజరు.. 48 మంది ఉద్యోగులపై కేసు నమోదు
ఎన్నికల విధులకు గైర్హాజరైన 48 మంది ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
పోలింగ్ డే.. కార్మికులకు వేతనంతో కూడిన సెలవు: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో సోమవారం (13వ తేదీ) కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీకి తరలుతున్న ఓటర్లు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా రద్దీ..
ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆ రాష్ట్ర ఓటర్లు స్వస్థలాలకు తరలి వెళ్తున్నారు. -
రూ.కోట్ల కుమ్మరింత!.. కీలక స్థానాల్లో ‘పంపిణీ’పై అభ్యర్థుల దృష్టి
హైదరాబాద్ సమీపంలోని ఓ లోక్సభ నియోజకవర్గంలో నోట్ల కుమ్మరింతకు రంగం సిద్ధమైంది. ఇక్కడ హేమాహేమీలు తలపడుతుండటంతో ఓటుకు కనీసం రూ.వెయ్యి పంచిపెట్టేందుకు అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. -
రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న భాజపా నేతలకు బుద్ధి చెబుదాం
‘‘400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతామంటున్న భాజపాకు కర్రు కాల్చి వాతపెడదాం. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న ఆ పార్టీ నాయకులకు గట్టిగా బుద్ధిచెబుదాం. -
కాంగ్రెస్వి ‘చైనా గ్యారంటీలు’!
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో ప్రధానమంత్రి అభ్యర్థే లేరని భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. -
భాజపాది విషం.. కాంగ్రెస్ది అబద్ధం
‘‘పదేళ్ల నిజం కేసీఆర్ పాలన.. పదేళ్ల విషం భాజపా పాలన.. 150 రోజుల అబద్ధం రేవంత్రెడ్డి పాలన.. ఈ మూడింటి మధ్యే లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. -
వేరే వాళ్ల చేతిలో కారు స్టీరింగ్
భారాస కారు స్టీరింగ్ వేరే వాళ్ల చేతిలో ఉండటంతో ఏమి చేయాలో తెలియక కేసీఆర్ ఆగమవుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్నారు. -
దక్షిణ భారతంపై ప్రధాని మోదీ ఉదాసీనత: మంత్రి తుమ్మల
ప్రధాని మోదీ ఉత్తర భారతంపై శ్రద్ధ చూపుతూ దక్షిణ భారతంపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. -
భాజపాకు ఓటమి భయం: మంత్రి పొన్నం
ప్రధాని మోదీ మాటల్ని తెలంగాణ ప్రజలు విశ్వసించట్లేదని, ఈ ఎన్నికల్లో భాజపా గ్రాఫ్ పడిపోయిందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. -
లోక్సభ ఎన్నికల తర్వాత భాజపా, భారాస కలవడం ఖాయం
ధనిక రాష్ట్రాన్ని రూ.7 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి అభివృద్ధి మాటున కమీషన్ల రూపంలో రూ.1.50 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఘనత గత భారాస సర్కారుకే దక్కుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు. -
మూడు స్థానాలపై సీఎం ప్రత్యేక దృష్టి!
పార్టీకి విజయావకాశాలు బలంగా ఉన్నాయనుకున్న చోట తక్కువ సంఖ్యలో, గట్టిపోటీ ఉందనుకున్న స్థానాల్లో ఎక్కువ ప్రచార సభలు నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ముగించింది. -
పోలింగ్ ముగిసే వరకు సైనికుల్లా పని చేయండి
లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలింగ్ ముగిసే వరకు సైనికుల్లా పని చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
నిశిరాత్రిలో ఓట్ల వేట!
ఎన్నికల్లో ప్రచార గడువు ముగియడంతో.. గుట్టుగా ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలను అభ్యర్థులు ముమ్మరం చేశారు. గ్రామాలు, కాలనీల వారీగా.. స్థానిక నాయకుల ఆధ్వర్యంలో రాత్రి క్యాంపులతో ప్రచారం నిర్వహించే ప్రణాళికను శనివారం అమల్లోకి తెచ్చారు. -
పీఎం అభ్యర్థి లేని కాంగ్రెస్కు ఓట్లెలా వేస్తారు?
ప్రధాన మంత్రి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు. -
పదేళ్ల భాజపా పాలనలో అభివృద్ధిపథంలో దేశం
దేశ రక్షణకు ప్రధాని మోదీ ఎంతో అవసరమని, అందుకు ప్రజలంతా భాజపా లోక్సభ అభ్యర్థులను గెలిపించాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. -
భారాసకు వేసే ఓటు.. గ్యారంటీల అమలుకు రూటు
‘భారాసకు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్ గ్యారంటీల అమలుకు రూటుగా మారుతుంది. ప్రజాక్షేత్రంలో ప్రశ్నించే గొంతుకగా మా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. -
భైంసా ఘటనతో కాంగ్రెస్, భారాస ఒక్కటేనని రుజువైంది
భైంసా రోడ్షోలో భారాస నేత కేటీఆర్పై గుడ్లు, టమాటాలు విసిరింది ఎవరో విచారించకుండా కాంగ్రెస్ పెద్దల ఆదేశాలతో భాజపా సానుభూతిపరులపై హత్యాయత్నం కేసులు బనాయించి జైలుకు పంపడం చూస్తుంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తేలిపోయిందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
హైదరాబాద్లో మజ్లిస్ను గెలిపించాలి.. తెలంగాణలో భాజపాను ఓడించాలి: ఒవైసీ
హైదరాబాద్లో మజ్లిస్ను గెలిపించాలని, తెలంగాణలో భాజపాను ఓడించాలంటూ మజ్లిస్ ప్రచారం చేసిందని.. అందుకు ప్రజలు, మజ్లిస్ అభిమానులు సిద్ధంగా ఉన్నారని హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
61 పోలింగ్ కేంద్రాల్లో వందలోపే ఓటర్లు
కొండలు, గుట్టల్లో విసిరేసినట్లు ఉండే తండాలు, గూడేల్లోని ఓటర్ల కోసం రాష్ట్ర ఎన్నికల అధికారులు ఈ ధపా ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
సామాజిక న్యాయం జరగాలంటే భాజపా గెలవాలి: మందకృష్ణ మాదిగ
దేశంలో అభివృద్ధి, సామాజిక న్యాయం జరగాలంటే భాజపా గెలవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
-
దిల్లీ చిత్తు.. బెంగళూరుకు వరుసగా ఐదో విజయం
-
కాంగ్రెస్తో ప్రాంతీయ పార్టీల పొత్తు.. శశిథరూర్ ఏమన్నారంటే?
-
తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం.. రైతులు ఆందోళన చెందొద్దు: సీఎం రేవంత్రెడ్డి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అవును.. వారి స్టైల్ కాపీ చేశా: నెటిజన్ ప్రశ్నపై జాన్వీ కపూర్
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!