icon icon icon
icon icon icon

BJP: మోదీ హవాతో తెలంగాణలో భాజపా క్లీన్‌ స్వీప్‌: పీయూష్‌ గోయల్‌

తెలంగాణలో హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో భాజపా గెలువబోతుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు.

Published : 22 Apr 2024 13:57 IST

చేవెళ్ల: తెలంగాణలో హైదరాబాద్ సహా మెజార్టీ స్థానాల్లో భాజపా గెలువబోతుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఎన్డీయే కూటమి 400కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఇండియా కూటమిలోని పార్టీల్లో ఐకమత్యం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కేరళలో సీపీఐతో కుస్తీ.. దిల్లీలో దోస్తీ చేస్తోందని ఎద్దేవా చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారతే తమ లక్ష్యమన్నారు. మోదీ హవాతో ఈ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్‌ స్వీప్‌ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం చేవెళ్ల లోక్‌సభ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. రాజేంద్రనగర్‌లోని ఆర్వో కార్యాలయంలో ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ శశాంకకు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img