PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం..
PV Narasimha Rao | ‘ఒక వ్యక్తి పుట్టుకతో కాదు, చేతల వల్ల గొప్పవాడవుతాడు’ కౌటిల్యుడు చెప్పిన ఈ మాటలు పీవీ నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయి. ఎందుకంటే ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈనాడు భారత్ను ఆర్థికంగా నిలబడేలా చేశాయనడంలో ఏమాత్రం సందేహంలేదు.
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపుతిప్పిన పీవీ నరసింహారావుకు.. ఆర్థికశాస్త్రంలో పెద్దగా అవగాహన లేదంటే నమ్మలేం కదూ! కానీ అది నిజం! రక్షణ, విదేశాంగ, మానవ వనరులు, హోంశాఖ.. ఇలా అనేక కీలకశాఖలు చేపట్టిన అనుభవమున్న పీవీకి ఆర్థికం ఎన్నడూ ఎదురుకాలేదు. పైగా ప్రధాని పదవి చేపట్టేనాటి దాకా తనది నెహ్రూ తరహా సామ్యవాద ధోరణి! లైసెన్స్రాజ్, కోటారాజ్లను రక్షించాలనే ధోరణే! కానీ... ప్రధాని కాగానే దేశ ఆర్థిక పరిస్థితిని ఆకళింపు చేసుకున్న ఆయన ఒక్కరోజులోనే తన విధానం పనికిరాదని గ్రహించారు... తనలాంటి సంప్రదాయ రాజకీయ నేతలతో దీన్ని బాగుచేయటం కుదరదనీ... ఆర్థికవేత్తే విత్తమంత్రి కావాలని నిర్ణయించుకున్నారు. మన్మోహన్ను ఎంచుకున్నారు. ఆయనకు అండగా నిలిచారు.
సంస్కరణల సింహం వచ్చింది
అనూహ్యంగా 1991 జూన్ 21న పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించటానికి క్షేత్ర స్థాయిలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చకచకా నిర్ణయాలు తీసుకున్నారు.
ఏం చేశారు?
- చెల్లింపుల సంక్షోభం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) నుంచి గట్టెక్కటానికి తీసుకున్న మొదటి నిర్ణయం రూపాయి విలువను తగ్గించటం. రెండు విడతలుగా తగ్గించారు. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి, ఎగుమతులు పెరగటానికి వీలుకలిగింది.
- ద్రవ్య లోటును తగ్గించటంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని తగ్గించాలని, చక్కెర మీద రాయితీ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఆదాయం పెరిగేందుకు, ఖర్చులు తగ్గేందుకు అవకాశం ఏర్పడింది.
- వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించటం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పోటీకి అవకాశం కల్పించారు.
- స్టాక్మార్కెట్లకు సంబంధించి పెద్దఎత్తున మార్పులు తీసుకువచ్చారు. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్ ఇండియా) కి 1992లో చట్టబద్ధత కల్పించారు. మూలధన సమీకరణకు వీలుగా తగిన చర్యలు తీసుకునే విధంగా సెబీని ప్రోత్సహించారు.
- పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు అత్యంత కీలకం. ఇందులో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనివల్ల ‘లైసెన్స్ రాజ్’ బలహీన పడి స్వేచ్ఛగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. ఈ విధానం వల్ల దాదాపు 80 శాతం పరిశ్రమలకు లైసెన్సులు తీసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వు చేసిన ఎన్నో రంగాల్లో ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. రైల్వేలు, అణు ఇంధనం, రక్షణ వంటి 8 రంగాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేటు రంగ సంస్థలు అడుగుపెట్టే అవకాశం ఏర్పడింది.
- విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఎన్నో పరిశ్రమల్లో 74% - 100% విదేశీ పెట్టుబడికి అనుమతించారు.
పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
ఇవిగో ఫలితాలు..
పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గడం ప్రారంభమైంది. నెమ్మదిగా ద్రవ్వోల్బణం అదుపులోకి రావటంతో పాటు ఇతర రంగాలు కుదుటపడ్డాయి. అంతేగాక కొత్తగా ప్రైవేటు రంగానికి, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన రంగాలకు పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. కొద్దికాలానికే సంస్కరణల ఫలాలు అందివచ్చి చాలా రంగాలు కళకళలాడాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగటం ప్రారంభమైంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. ఈ రోజు మనదేశం చేతిలో 500 బిలియన్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు సంపన్నులకు పరిమితమైన విమాన ప్రయాణం సామాన్యులకు చేరువైంది. దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పెద్దఎత్తున జరిగింది. ప్రైవేటు రంగం లక్షల ఉద్యోగాలు కల్పించగలిగే స్థితికి ఎదిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉందంటే దానికి పునాది పడింది పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలతోనే.
ఇవీ పీవీ ముద్రలు..
- నవోదయ విద్యాలయాలు: మానవవనరుల మంత్రిగా ఆయన నిర్ణయంతో నాణ్యమైన గురుకుల విద్యకివి శ్రీకారం చుట్టాయి.
- భూసంస్కరణలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెచ్చిన భూసంస్కరణలు విప్లవ నిర్ణయం. దీంతో రైతులు భూ యజమానులయ్యారు.
- ఆర్థిక స్వాతంత్య్రం: ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చాయి.
- అణు అండాదండా..: భారత్ను పూర్తిస్థాయి అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దే ప్రయోగాలు, క్షిపణుల తయారీకి ప్రోత్సాహం
- అటు పశ్చిమం, ఇటు తూర్పు: ఇజ్రాయెల్తో దోస్తీ... ఆగ్నేయాసియాతో బంధం (లుక్ఈస్ట్), చైనాతోనూ చెలిమి, రష్యా, అమెరికాల మధ్య సమతౌల్యం
- శ్రేయోరాజ్యం: కేవలం సంక్షేమంతో ప్రజల్ని ప్రభుత్వంపై ఆధారపడేలా కాకుండా.... వారు స్వయం సమృద్ధి సాధించేలా శ్రేయోరాజ్య పథకాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం