PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం..
PV Narasimha Rao | ‘ఒక వ్యక్తి పుట్టుకతో కాదు, చేతల వల్ల గొప్పవాడవుతాడు’ కౌటిల్యుడు చెప్పిన ఈ మాటలు పీవీ నరసింహారావుకు అతికినట్లు సరిపోతాయి. ఎందుకంటే ప్రధానిగా ఆయన చేసిన కృషి నిరుపమానం. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈనాడు భారత్ను ఆర్థికంగా నిలబడేలా చేశాయనడంలో ఏమాత్రం సందేహంలేదు.
ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని మలుపుతిప్పిన పీవీ నరసింహారావుకు.. ఆర్థికశాస్త్రంలో పెద్దగా అవగాహన లేదంటే నమ్మలేం కదూ! కానీ అది నిజం! రక్షణ, విదేశాంగ, మానవ వనరులు, హోంశాఖ.. ఇలా అనేక కీలకశాఖలు చేపట్టిన అనుభవమున్న పీవీకి ఆర్థికం ఎన్నడూ ఎదురుకాలేదు. పైగా ప్రధాని పదవి చేపట్టేనాటి దాకా తనది నెహ్రూ తరహా సామ్యవాద ధోరణి! లైసెన్స్రాజ్, కోటారాజ్లను రక్షించాలనే ధోరణే! కానీ... ప్రధాని కాగానే దేశ ఆర్థిక పరిస్థితిని ఆకళింపు చేసుకున్న ఆయన ఒక్కరోజులోనే తన విధానం పనికిరాదని గ్రహించారు... తనలాంటి సంప్రదాయ రాజకీయ నేతలతో దీన్ని బాగుచేయటం కుదరదనీ... ఆర్థికవేత్తే విత్తమంత్రి కావాలని నిర్ణయించుకున్నారు. మన్మోహన్ను ఎంచుకున్నారు. ఆయనకు అండగా నిలిచారు.
సంస్కరణల సింహం వచ్చింది
అనూహ్యంగా 1991 జూన్ 21న పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించటానికి క్షేత్ర స్థాయిలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. చకచకా నిర్ణయాలు తీసుకున్నారు.
ఏం చేశారు?
- చెల్లింపుల సంక్షోభం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్) నుంచి గట్టెక్కటానికి తీసుకున్న మొదటి నిర్ణయం రూపాయి విలువను తగ్గించటం. రెండు విడతలుగా తగ్గించారు. దీంతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడానికి, ఎగుమతులు పెరగటానికి వీలుకలిగింది.
- ద్రవ్య లోటును తగ్గించటంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఎరువుల రాయితీని తగ్గించాలని, చక్కెర మీద రాయితీ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలు ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. దీంతో ఆదాయం పెరిగేందుకు, ఖర్చులు తగ్గేందుకు అవకాశం ఏర్పడింది.
- వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకులకు స్వేచ్ఛనిచ్చారు. ప్రైవేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించటం ద్వారా బ్యాంకింగ్ రంగంలో పోటీకి అవకాశం కల్పించారు.
- స్టాక్మార్కెట్లకు సంబంధించి పెద్దఎత్తున మార్పులు తీసుకువచ్చారు. సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డు ఆఫ్ ఇండియా) కి 1992లో చట్టబద్ధత కల్పించారు. మూలధన సమీకరణకు వీలుగా తగిన చర్యలు తీసుకునే విధంగా సెబీని ప్రోత్సహించారు.
- పారిశ్రామిక రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు అత్యంత కీలకం. ఇందులో భాగంగా 1991 నూతన పారిశ్రామిక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. దీనివల్ల ‘లైసెన్స్ రాజ్’ బలహీన పడి స్వేచ్ఛగా పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం కలిగింది. ఈ విధానం వల్ల దాదాపు 80 శాతం పరిశ్రమలకు లైసెన్సులు తీసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వు చేసిన ఎన్నో రంగాల్లో ప్రైవేటు రంగానికి ప్రవేశం కల్పించారు. రైల్వేలు, అణు ఇంధనం, రక్షణ వంటి 8 రంగాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని రంగాల్లో ప్రైవేటు రంగ సంస్థలు అడుగుపెట్టే అవకాశం ఏర్పడింది.
- విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. ఎన్నో పరిశ్రమల్లో 74% - 100% విదేశీ పెట్టుబడికి అనుమతించారు.
పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
ఇవిగో ఫలితాలు..
పీవీ సంస్కరణలతో కరెంటు ఖాతా లోటు తగ్గడం ప్రారంభమైంది. నెమ్మదిగా ద్రవ్వోల్బణం అదుపులోకి రావటంతో పాటు ఇతర రంగాలు కుదుటపడ్డాయి. అంతేగాక కొత్తగా ప్రైవేటు రంగానికి, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచిన రంగాలకు పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. కొద్దికాలానికే సంస్కరణల ఫలాలు అందివచ్చి చాలా రంగాలు కళకళలాడాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరగటం ప్రారంభమైంది. ఇక వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం కలగలేదు. ఈ రోజు మనదేశం చేతిలో 500 బిలియన్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. అంతేకాదు, ఒకప్పుడు సంపన్నులకు పరిమితమైన విమాన ప్రయాణం సామాన్యులకు చేరువైంది. దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన పెద్దఎత్తున జరిగింది. ప్రైవేటు రంగం లక్షల ఉద్యోగాలు కల్పించగలిగే స్థితికి ఎదిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ ఉందంటే దానికి పునాది పడింది పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలతోనే.
ఇవీ పీవీ ముద్రలు..
- నవోదయ విద్యాలయాలు: మానవవనరుల మంత్రిగా ఆయన నిర్ణయంతో నాణ్యమైన గురుకుల విద్యకివి శ్రీకారం చుట్టాయి.
- భూసంస్కరణలు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెచ్చిన భూసంస్కరణలు విప్లవ నిర్ణయం. దీంతో రైతులు భూ యజమానులయ్యారు.
- ఆర్థిక స్వాతంత్య్రం: ప్రధానిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఆర్థిక స్వాతంత్య్రాన్ని తెచ్చాయి.
- అణు అండాదండా..: భారత్ను పూర్తిస్థాయి అణ్వస్త్ర దేశంగా తీర్చిదిద్దే ప్రయోగాలు, క్షిపణుల తయారీకి ప్రోత్సాహం
- అటు పశ్చిమం, ఇటు తూర్పు: ఇజ్రాయెల్తో దోస్తీ... ఆగ్నేయాసియాతో బంధం (లుక్ఈస్ట్), చైనాతోనూ చెలిమి, రష్యా, అమెరికాల మధ్య సమతౌల్యం
- శ్రేయోరాజ్యం: కేవలం సంక్షేమంతో ప్రజల్ని ప్రభుత్వంపై ఆధారపడేలా కాకుండా.... వారు స్వయం సమృద్ధి సాధించేలా శ్రేయోరాజ్య పథకాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్