ఆహారాన్ని అద్భుతంగా నిల్వ చేసే ‘అరేడియేషన్’.. భారత్లో తొలిసారి ఉల్లిపాయలపై ప్రయోగం!
ఉల్లిపాయల (onions) ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు భారత (India) ప్రభుత్వం ‘అరేడియేషన్’ టెక్నాలజీని (Irradiation technology) ప్రవేశపెట్టనుంది. దాంతో ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులు, వినియోగదారులకు లాభం చేకూరుతుంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటా (Tamato) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో మార్కెట్కు వెళ్లి వీటిని కొనాలంటేనే సామాన్యుడు వెనకడుగు వేసే పరిస్థితి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి (onions) కూడా ఇలాగే ఉండేది. అందుకే భారత ప్రభుత్వం ఓ సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత దాన్ని ఉల్లిపాయలపై ప్రయోగించనుంది. దాంతో ఎక్కువ కాలం ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పైగా ఆ పంట పండించిన రైతులు సైతం నష్టాల బారిన పడకుండా చూడొచ్చు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది? ఓసారి పరిశీలిస్తే..
ఏంటీ ‘అరేడియేషన్’?
‘అరేడియేషన్’(irradiation) ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్ అయనీకరణం చేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఎలక్ట్రాన్ కిరణాలను వినియోగిస్తారు. ప్రస్తుతం మన ఉల్లిపాయలను గామా రేడియేషన్కు గురి చేయనున్నారు. ఇలా చేయడం వల్ల అందులోని సూక్ష్మజీవులు, కీటకాలు నశించడంతో వాటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పాలను పాయిశ్చరైజ్ చేయడం, పండ్లు, కూరగాయాలను క్యానింగ్ చేయడం వల్ల వినియోగదారులకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో అలాంటి ప్రయోజనాలే ఈ విధానంలోనూ కలుగుతాయి. పేరులో రేడియేషన్ ఉంది గనక ఈ సాంకేతికత ఆహారాన్ని రేడియోధార్మికతగా మార్చదు. నాణ్యత, రుచి, ఆకృతి తదితర విషయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాదు.
‘అరేడియేషన్’లో ఏ మార్పు జరిగినా అది చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే ఏదైనా పదార్థం ‘అరేడియేషన్’కు గురైందా? అనేది చూసి గుర్తించడం చాలా కష్టం. ఈ విధానాన్ని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆమోదించాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీకి చెందిన లెవిస్ స్టాడ్లర్ అనే శాస్త్రవేత్త తొలిసారి విత్తనాలపై ఈ ప్రయోగం చేశాడు. ఈ ప్రక్రియ తృణ ధాన్యాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లిపై సమర్థవంతంగా పనిచేసింది.
ప్రయోజనాలివే..
- ‘అరేడియేషన్’ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధులు తగ్గుతాయి. ఆహారంలోని సాల్మోనెల్లా, ఈకోలి వంటి హానికారక జీవులు నశిస్తాయి.
- ‘అరేడియేషన్’ వల్ల పండ్లు, కూరగాయల నిల్వ కాలం పెరుగుతుంది. అవి త్వరగా కుళ్లిపోవడానికి కారణమయ్యే జీవులను నాశనం చేయడంతో ఇది సాధ్యపడుతుంది.
- పండ్లలోని కీటకాలు నశిస్తాయి. శీతల గిడ్డంగిలో వాటిని నిల్వ చేసేందుకు మళ్లీ ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు.
- ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే మొలకలు వస్తాయి. ఈ ప్రక్రియ అలా రానివ్వదు. అంతేకాదు త్వరగా పక్వానికి రాకుండా అడ్డుకుంటుంది.
- ‘అరేడియేషన్’ క్రిమిరహితంలా పనిచేస్తుంది. దాంతో శీతల ప్రదేశాల్లో నిల్వ చేయకపోయినా పండ్లు, కూరగాయలు చెడిపోవు.
ధరల్లో హెచ్చుతగ్గుల నివారణ
ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఈ ఏడాదిలో భారత ప్రభుత్వం సుమారు 3లక్షల టన్నుల ఉల్లిని అదనపు బఫర్ స్టాక్గా సేకరించనుంది. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) సహాయంతో ఉల్లిపాయలపై ‘అరేడియేషన్’ సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. దీని ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిపాయలను శీతల గిడ్డంగికి తరలించక ముందే ‘అరేడియేషన్’ ప్రక్రియ చేస్తారు.
ఒడిశాలో పోలీసు పావురాలు.. విధి నిర్వహణలో సత్తా చాటాయి!
ఇదీ.. ప్రభుత్వ ప్రణాళిక
భారత్లో పండించిన ఉల్లి త్వరగా కుళ్లిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసినా అవి మొలకెత్తి వృథాగా పోతున్నాయి. 25 శాతంగా ఉన్న ఈ నష్టాన్ని 10-12 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులు సుమారు 20 రోజులపాటు కొనసాగుతాయి. అదనపు బఫర్ స్టాక్, ‘అరేడియేషన్’ టెక్నాలజీ సహాయంతో ఆ కాలంలో ధరల్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 150 టన్నుల ఉల్లిపాయలను ‘అరేడియేషన్’ చేయనున్నారు. మహారాష్ట్రలోని లాసల్గావ్లో ప్రక్రియ సాగనుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు