ఆహారాన్ని అద్భుతంగా నిల్వ చేసే ‘అరేడియేషన్’.. భారత్లో తొలిసారి ఉల్లిపాయలపై ప్రయోగం!
ఉల్లిపాయల (onions) ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు భారత (India) ప్రభుత్వం ‘అరేడియేషన్’ టెక్నాలజీని (Irradiation technology) ప్రవేశపెట్టనుంది. దాంతో ఉల్లిపాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. రైతులు, వినియోగదారులకు లాభం చేకూరుతుంది.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం టమాటా (Tamato) ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దాంతో మార్కెట్కు వెళ్లి వీటిని కొనాలంటేనే సామాన్యుడు వెనకడుగు వేసే పరిస్థితి. గతంలో ఉల్లిపాయల పరిస్థితి (onions) కూడా ఇలాగే ఉండేది. అందుకే భారత ప్రభుత్వం ఓ సరికొత్త సాంకేతికతను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తొలుత దాన్ని ఉల్లిపాయలపై ప్రయోగించనుంది. దాంతో ఎక్కువ కాలం ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఉంటాయి. పైగా ఆ పంట పండించిన రైతులు సైతం నష్టాల బారిన పడకుండా చూడొచ్చు. ఇంతకీ ఏంటా టెక్నాలజీ? ఎలా పనిచేస్తుంది? ఓసారి పరిశీలిస్తే..
ఏంటీ ‘అరేడియేషన్’?
‘అరేడియేషన్’(irradiation) ప్రక్రియలో ఆహారాన్ని రేడియేషన్ అయనీకరణం చేస్తారు. ఇందుకోసం గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఎలక్ట్రాన్ కిరణాలను వినియోగిస్తారు. ప్రస్తుతం మన ఉల్లిపాయలను గామా రేడియేషన్కు గురి చేయనున్నారు. ఇలా చేయడం వల్ల అందులోని సూక్ష్మజీవులు, కీటకాలు నశించడంతో వాటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పాలను పాయిశ్చరైజ్ చేయడం, పండ్లు, కూరగాయాలను క్యానింగ్ చేయడం వల్ల వినియోగదారులకు ఎలాంటి లాభాలు కలుగుతున్నాయో అలాంటి ప్రయోజనాలే ఈ విధానంలోనూ కలుగుతాయి. పేరులో రేడియేషన్ ఉంది గనక ఈ సాంకేతికత ఆహారాన్ని రేడియోధార్మికతగా మార్చదు. నాణ్యత, రుచి, ఆకృతి తదితర విషయాల్లో ఎలాంటి మార్పు తీసుకురాదు.
‘అరేడియేషన్’లో ఏ మార్పు జరిగినా అది చాలా స్వల్పంగా ఉంటుంది. అందుకే ఏదైనా పదార్థం ‘అరేడియేషన్’కు గురైందా? అనేది చూసి గుర్తించడం చాలా కష్టం. ఈ విధానాన్ని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆమోదించాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మిస్సౌరీకి చెందిన లెవిస్ స్టాడ్లర్ అనే శాస్త్రవేత్త తొలిసారి విత్తనాలపై ఈ ప్రయోగం చేశాడు. ఈ ప్రక్రియ తృణ ధాన్యాలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లిపై సమర్థవంతంగా పనిచేసింది.
ప్రయోజనాలివే..
- ‘అరేడియేషన్’ చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధులు తగ్గుతాయి. ఆహారంలోని సాల్మోనెల్లా, ఈకోలి వంటి హానికారక జీవులు నశిస్తాయి.
- ‘అరేడియేషన్’ వల్ల పండ్లు, కూరగాయల నిల్వ కాలం పెరుగుతుంది. అవి త్వరగా కుళ్లిపోవడానికి కారణమయ్యే జీవులను నాశనం చేయడంతో ఇది సాధ్యపడుతుంది.
- పండ్లలోని కీటకాలు నశిస్తాయి. శీతల గిడ్డంగిలో వాటిని నిల్వ చేసేందుకు మళ్లీ ప్రత్యేకంగా మందులు వాడాల్సిన అవసరం ఉండదు.
- ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉంచితే మొలకలు వస్తాయి. ఈ ప్రక్రియ అలా రానివ్వదు. అంతేకాదు త్వరగా పక్వానికి రాకుండా అడ్డుకుంటుంది.
- ‘అరేడియేషన్’ క్రిమిరహితంలా పనిచేస్తుంది. దాంతో శీతల ప్రదేశాల్లో నిల్వ చేయకపోయినా పండ్లు, కూరగాయలు చెడిపోవు.
ధరల్లో హెచ్చుతగ్గుల నివారణ
ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులను నివారించేందుకు ఈ ఏడాదిలో భారత ప్రభుత్వం సుమారు 3లక్షల టన్నుల ఉల్లిని అదనపు బఫర్ స్టాక్గా సేకరించనుంది. అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) సహాయంతో ఉల్లిపాయలపై ‘అరేడియేషన్’ సాంకేతికతను ప్రయోగాత్మకంగా పరిశీలించనుంది. ఈ విషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. దీని ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేసిన ఉల్లిపాయలను శీతల గిడ్డంగికి తరలించక ముందే ‘అరేడియేషన్’ ప్రక్రియ చేస్తారు.
ఒడిశాలో పోలీసు పావురాలు.. విధి నిర్వహణలో సత్తా చాటాయి!
ఇదీ.. ప్రభుత్వ ప్రణాళిక
భారత్లో పండించిన ఉల్లి త్వరగా కుళ్లిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసినా అవి మొలకెత్తి వృథాగా పోతున్నాయి. 25 శాతంగా ఉన్న ఈ నష్టాన్ని 10-12 శాతానికి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉల్లి ధరల్లో హెచ్చుతగ్గులు సుమారు 20 రోజులపాటు కొనసాగుతాయి. అదనపు బఫర్ స్టాక్, ‘అరేడియేషన్’ టెక్నాలజీ సహాయంతో ఆ కాలంలో ధరల్ని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 150 టన్నుల ఉల్లిపాయలను ‘అరేడియేషన్’ చేయనున్నారు. మహారాష్ట్రలోని లాసల్గావ్లో ప్రక్రియ సాగనుంది.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా