రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు

దేశంలో రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. 110 చోట్ల నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ కిట్లు

Published : 27 Sep 2020 14:41 IST

                                                                                                

న్యూదిల్లీ : దేశంలో రోజుకి 5 లక్షలకు పైగా పీపీఈ కిట్లు తయారవుతున్నట్లు కేంద్ర వైద్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. 110 చోట్ల నుంచి అందుబాటులోకి వస్తున్న ఈ కిట్లు అన్ని రాష్ర్టాలకు కావల్సినన్ని పంపిణీ చేస్తున్నట్లు ఆయన వివరించారు. గతంలో పీపీఈ కిట్లు కొరత ఉందన్న రాష్ర్టాలే ప్రస్తుతం వాటిని నిల్వ చేయడానికి స్థలం లేదనే స్థాయికి చేరుకున్నాయని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏడు కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపిన ఆయన రికవరీ రేటు 82 శాతం ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1823 కొవిడ్‌ నిర్ధరణ ల్యాబ్‌ల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని