సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు.. రాత్రి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. బకాసుర వధ అలంకారంలో...

Updated : 22 Sep 2020 22:17 IST

తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు.. రాత్రి సర్వభూపాల వాహనంపై దర్శనమిచ్చారు. బకాసుర వధ అలంకారంలో స్వామివారు అభయ ప్రదానం చేశారు. ఆలయంలోని కల్యాణ మండపంలో వాహన సేవను అర్చకులు కొలువుదీర్చారు. మంగళవాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కొవిడ్‌ ప్రభావంతో వాహన సేవలను అధికారులు ఆలయానికి పరిమితం చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని