Hyderabad: శంషాబాద్‌లో ఎయిర్‌ అలయన్స్‌ విమానాలు రద్దు.. ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఈరోజు ఎయిరిండియా విమానాలు రద్దయ్యాయి. మొత్తం ఎనిమిది విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.

Updated : 10 Apr 2023 15:01 IST

హైదరాబాద్: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఎయిర్‌ అలయన్స్‌ విమానాలు రద్దయ్యాయి. మొత్తం 9 విమాన సర్వీసులను నిలిపివేసినట్లు ఆ సంస్థ పేర్కొంది. తిరుపతి, బెంగళూరు, మైసూర్‌, హైదరాబాద్‌ సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్స్‌ అధికారులు తెలిపారు.

ముందస్తు సమాచారం లేకుండా చివరి నిమిషంలో విమానాలు రద్దు చేయడంపై ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సిబ్బంది తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన యాజమాన్యం.. టికెట్‌ డబ్బులను ప్రయాణికులకు రీఫండ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని