దేశంలో ఎన్నడూ లేనంత స్థాయికి విద్యుత్ డిమాండ్!
మంగళవారం భారతదేశ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఎన్నడూ లేనంత పైస్థాయిని అందుకుంది. ‘‘రాత్రి 11.43 గంటలవద్ద 1,97,060 మెగావాట్ల డిమాండ్ను చేరుకుంది’’ అని విద్యుత్ మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: భారతదేశంలో విద్యుత్ డిమాండ్ ఎన్నడూ లేనంత పైస్థాయిని అందుకుంది. ‘‘ మంగళవారంరాత్రి 11.43 గంటలవద్ద 1,97,060 మెగావాట్ల డిమాండ్ను చేరుకుంది’’ అని విద్యుత్ మంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.
ఇంతకుముందు జులై 1న భారీ స్థాయిలో 1,91,240 మెగావాట్ల విద్యుత్ వినియోగమైంది. పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్, దేశంలో మహమ్మారి బారిన పడ్డ పారిశ్రామిక, వాణిజ్య రంగాలు తిరిగి పుంజుకున్నాయనేందుకు, ఆర్థిక కార్యకలాపాలు గాడినపడ్డాయనేందుకు సంకేతమని వివరించింది. కాగా దేశపు మొత్తం విద్యుత్ అవసరాల్లో పారిశ్రామిక రంగం నుంచి 41 శాతం, వ్యవసాయ రంగం నుంచి 18 శాతం డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత వాణిజ్యపరంగా విద్యుత్ వినియోగం 8.24 శాతం ఉంటోంది. దేశంలోని థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు ఆర్థికంగా తగినంత సహాయసహకారాలు లభించక గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నవేళ, వాటిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో తాజాగా పెరిగిపోయిన విద్యుత్ డిమాండ్ ప్రాముఖ్యం సంతరించుకుంది. ఇదిలావుంటే కొవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు విద్యుత్ డిమాండ్ భారీగా పడిపోయింది. ఆ తర్వాత కొవిడ్ సెకండ్ వేవ్ పీక్లో ఉన్నప్పటికీ విద్యుత్ వినియోగం పెరుగుతూనే వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ఆరున్నరేళ్ల పరుగు.. 50 కోట్ల ప్రయాణికులు
హైదరాబాద్ మెట్రోరైలు 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని చేరుకుంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ అంటే బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు