Ap News: పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం
ఉద్యోగులకు ఏపీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా
అమరావతి: ఉద్యోగులకు ఏపీ సర్కార్ ప్రకటించిన పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగ సంఘాలతో పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోలేదని పేర్కొన్నారు. అసుతోష్ మిశ్రా కమిషన్ ఇచ్చిన నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇచ్చి ఉండాల్సిందని వారు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సచివాలయంలో ఉద్యోగుల సంఘం ప్రతినిధులు సీఎస్ సమీర్ శర్మను కలిసి విజ్ఞాపన పత్రం అందించారు.
‘‘2010లోనే అప్పటి పీఆర్సీ సిఫార్సుల మేరకు 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 30 శాతమైనా ప్రకటించి ఉండాల్సింది. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ 30 శాతంగా పీఆర్సీ ఉంది. పీఆర్సీ సంఘం సిఫార్సు చేసినట్టుగా ఇంటి అద్దె భత్యం, సీసీఏలు యథాతథంగా కొనసాగడమే కాకుండా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇచ్చే భత్యాలు అలాగే కొనసాగించాలి. 70-79 ఏళ్ల మధ్య ఉన్న పెన్షనర్లకు అదనంగా 10 శాతం పెన్షన్ ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న 5 డీఏలు చెల్లించాలి. వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రోబేషన్ డిక్లేర్ చేయాలి. 1993 నుంచి పనిచేస్తున్న 5 వేల మంది కంటింజెంట్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి. పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నాం’’ అని సీఎస్కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం