విశాఖ తీరంలో ‘నౌక’ రెస్టారెంట్‌!

ఇలీవల విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఓడను కొనుగోలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఓడను రూ.10 కోట్లతో కొనుగోలు చేసి అక్కడే రెస్టారెంట్‌గా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు....

Published : 19 Dec 2020 00:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇలీవల విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఓడను కొనుగోలు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఓడను రూ.10 కోట్లతో కొనుగోలు చేసి అక్కడే రెస్టారెంట్‌గా మార్చాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తీవ్ర వాయుగుండం కారణంగా బంగ్లాదేశ్‌కు చెందిన వాణిజ్య నౌక ‘ఎమ్‌వీ మా’ ఔటర్‌ హార్బర్‌ నుంచి నాలుగు నాటికల్‌ మైళ్లు ప్రయాణించి విశాఖలోని తెన్నీటి పార్కు వద్ద తీరానికి కొట్టుకువచ్చింది. అయితే దాన్ని తిరిగి జలాల్లోకి తరలించేందుకు భారీ మొత్తంలో ఖర్చు కానున్న నేపథ్యంలో ఇక్కడే ఉంచి రెస్టారెంట్‌గా మార్చాలని భావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని కొనుగోలు చేసి హోటల్‌గా మార్చాలనుకుంటోంది. దీనిపై సచివాలయంలో ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో పర్యాటకశాఖ మంత్రి సమావేశమై చర్చలు జరిపారు. ఈ మేరకు బంగ్లాదేశీ ఓడ యజమానితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఓడను కొనుగోలు చేసిన తర్వాత పర్యాటకులను ఆకర్షించే విధంగా ఓడలో మార్పులు చేపట్టి రెస్టారెంట్‌గా మార్చేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చదవండి...

స్విమ్మింగ్‌పూల్‌.. రిజర్వాయర్లే డైనింగ్‌ హాళ్లు
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని