భారత సైన్యంలో కొత్త వాహనాలు..!
పదాతి దళాలను వేగంగా యుద్ధభూమికి తరలించడం సహా శత్రు ట్యాంకులను ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వాహనాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది.
దిల్లీ: పదాతి దళాలను వేగంగా యుద్ధభూమికి తరలించడం సహా శత్రు ట్యాంకులను ధ్వంసం చేయగలిగే అత్యాధునిక వాహనాలను సమకూర్చుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. అందులో భాగంగా 1980 నుంచి వినియోగిస్తున్న వాహనాల స్థానంలో కొత్త వాహనాలను భర్తీ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఈ మేరకు రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్(ఆర్ఎఫ్ఐ)ను జారీ చేసినట్లు ఓ సీనియర్ సైనికాధికారి గురువారం వెల్లడించారు. భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. తూర్పు లద్దాఖ్లాంటి ఎత్తైన ప్రదేశాలకు బలగాలను వేగంగా తరలించేందుకు అధునాతన ఆయుధాలతో కూడిన 1750 పదాతిదళ పోరాట వాహనాలు, తక్కువ బరువున్న 350 ట్యాంకర్లను కొనుగోలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ‘మేకిన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ కింద ఈ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సైన్యం ప్రతిపాదనలకు అనుగుణంగా వాహనాలను సరఫరా చేసేందుకు ఆసక్తి ఉన్న తయారీ సంస్థలు వారంలోగా తమ అభిప్రాయాన్ని తెలుపాలని సూచించారు. ఈ వాహనాలను సైన్యం మూడు దశల్లో స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. విదేశీ సంస్థలతో కలిసి వాహనాల తయారీ చేపట్టవచ్చన్నారు. అయితే రెండేళ్లలో ప్రతిపాదిత వాహనాలను పూర్తిస్థాయిలో అందజేయాల్సి ఉంటుందన్నారు. అధునాతన పదాతిదళ వాహనాల కొనుగోలుకు రక్షణ శాఖ 2009లోనే నిర్ణయించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా లద్దాఖ్ వద్ద చైనాతో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం