Kamareddy: కామారెడ్డిలో కొనసాగుతున్న బంద్.. పలువురు నాయకుల అరెస్టు
పట్టణ నూతన మాస్టర్ప్లాన్ను వ్యతిరేకిస్తూ కామారెడ్డిలో రైతులు చేపట్టిన బంద్ కొనసాగుతోంది. ఉదయ నుంచి ఆయా పక్షాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
కామారెడ్డి పట్టణం: మాస్టర్ ప్లాన్లో సాగు భూములను పరిశ్రమల జోన్ నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో శుక్రవారం రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా రైతుల వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకోని కలెక్టర్ వైఖరిపై ఆందోళన బాట పట్టారు. ఉదయం నుంచి ఆయా పక్షాల నాయకులను అరెస్టు చేశారు.
భాజపా అసెంబ్లీ ఇన్ఛార్జి వెంకటరమణారెడ్డిని రాజంపేట పోలీసు స్టేషన్కు తరలించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని ఇందిరా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి కామారెడ్డి పట్టణ పోలీసు స్టేషన్కు తరలించారు. జిల్లా కేంద్రంలో వ్యాపార దుకాణాలు, విద్యాసంస్థలు మూసివేశారు. పోలీసులు వాహనాల్లో తిరుగుతూ ర్యాలీ నిర్వహించే వారిని అరెస్టు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పలు అభ్యంతరాలకు ఈనెల 11 వ తేదీ వరకు అధికారులు అవకాశం కల్పించారు. ఇప్పటికే రైతులు 550 మంది కోర్టు నుంచి నోటీసుల పంపించారు. మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా రైతులు సంతకాల సేకరణ చేసిన లేఖను గవర్నర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, పురపాలక మంత్రికి పంపించారు.
కాగా.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్పై గురువారం మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. ప్రజా ఆమోద మాస్టర్ ప్లాన్నే రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ మాత్రమేనని.. ఇది తుది జాబితా కాదని రైతులకు ఎందుకు అవగాహన కల్పించలేదని అధికారులను ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ వివాదం కామారెడ్డిలో రాజకీయంగా దుమారం రేపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం