CM Jagan: ఎలా ముందుకెళ్దాం?.. హైకోర్టు తీర్పుపై సీఎం జగన్‌ సమీక్ష

రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని.

Updated : 03 Mar 2022 14:48 IST

అమరావతి: రాజధాని అంశంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం జగన్‌ కీలక సమీక్ష నిర్వహించనున్నారు. రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని.. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వ వ్యవహరించాలంటూ హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు. ఇప్పటికే ఆయన సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం సమీక్ష అనంతరం ప్రభుత్వ విధానాన్ని మంత్రి బొత్స మీడియాకు వెల్లడించే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని