TS News: తెలంగాణ ఆహార కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల పదవీకాలం పొడిగింపు

రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు మరో దఫా పదవుల్లో కొనసాగనున్నారు. ఛైర్మన్‌ తిరుమల రెడ్డి, సభ్యులు ఓరుగంటి ఆనంద్‌, గోవర్ధన్‌రెడ్డి, రంగినేని శారద, ఎం.భారతిలను ప్రభుత్వం మరోమారు నియమించింది. మరో ఐదేళ్లపాటు లేదా 65ఏళ్ల వయస్సు...

Published : 28 May 2022 22:47 IST

హైదరాబాద్‌: రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు మరో దఫా పదవుల్లో కొనసాగనున్నారు. ఛైర్మన్‌ తిరుమల రెడ్డి, సభ్యులు ఓరుగంటి ఆనంద్‌, గోవర్ధన్‌రెడ్డి, రంగినేని శారద, ఎం.భారతిలను ప్రభుత్వం మరోమారు నియమించింది. మరో ఐదేళ్లపాటు లేదా 65ఏళ్ల వయస్సు వచ్చే వరకు వారు పదవుల్లో కొనసాగనున్నారు. దీంతో రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌గా తిరుమలరెడ్డి మరో 11 నెలలపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సభ్యులుగా కొనసాగనున్న ఓరుగంటి ఆనంద్‌, గోవర్ధన్‌రెడ్డి, రంగినేని శారద, ఎం.భారతి మరో ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. ఈమేరకు పౌరసరఫరాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని