‘మేం బాగున్నాం.. పుకార్లు నమ్మొద్దు’
చైనాలో కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో అక్కడున్న తెలుగువారి ఆరోగ్య పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడున్న తెలుగువారిని సొంత రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు...
వుహాన్లో ఉన్న తెలుగు ఇంజినీర్ల సెల్ఫీ వీడియో
హైదరాబాద్: చైనాలో కరోనా వైరస్ ప్రబలుతోన్న నేపథ్యంలో అక్కడున్న తెలుగువారి ఆరోగ్య పరిస్థితులపై పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇప్పటికే అక్కడున్న తెలుగువారిని సొంత రాష్ట్రాలకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉద్యోగరీత్యా చైనాలోని వుహాన్లో పనిచేస్తున్న తెలుగు ఇంజినీర్లు వారి ఆరోగ్య పరిస్థితులపై ఒక సెల్ఫీ వీడియో తీసి పంపించారు.
‘మమ్మల్ని ఎవరూ బంధించలేదు. ఇక్కడ అందరం క్షేమంగా ఉన్నాం. సమయానికి ఆహారం, నీళ్లు అందిస్తున్నారు. మాకు రోజూ వైద్య పరీక్షలు చేస్తున్నారు. మేం పనిచేస్తున్న కంపెనీ మమ్మల్ని బాగా చూసుకుంటోంది. మా విషయంలో ఎలాంటి పుకార్లు నమ్మొద్దు. బీజింగ్లోని భారత ఎంబసీతో మాట్లాడాం. త్వరలోనే భారత్కు తిరిగి వచ్చేస్తాం’ అని వారు పంపించిన వీడియోలో తెలుగు ఇంజినీర్లు పేర్కొన్నారు.
అన్ని వసతులు కల్పిస్తున్నాం: టీసీఎల్
చైనాలో ఉన్న టీసీఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్ల ఆరోగ్య పరిస్థితులపై ఆ సంస్థ స్పందించింది. ‘చైనాలోని షెంజన్ నగరంలో శిక్షణలో ఉన్న 16 మంది ఉద్యోగులు ఇప్పటికే హాంకాంగ్ చేరుకున్నారు. వీరు కాకుండా మరో 58 మంది వుహాన్లో ఉన్నారు. అక్కడ వాళ్ళకి అన్ని వసతులు కల్పిస్తున్నాం. హౌస్ అరెస్ట్ చేశారని వస్తున్న వార్తలు అవాస్తవం. వుహాన్ నగరంలో రాకపోకలకు నిషేధం ఉంది. ప్రస్తుతం అక్కడ బయటకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. భారత ఎంబసీతో సంస్థ సంప్రదింపులు జరుపుతోంది. మూడు రోజుల్లో సానుకూల సంకేతాలు వస్తాయని ఆశిస్తున్నాం. వారికి రోజూ ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నాం. ప్రతి ఒక్కరి పరిస్థితి నిలకడగా ఉంది’ అని టీసీఎల్ సంస్థ ప్రతినిధి రఘు తెలిపారు.
ఇవీ చదవండి..
రక్షించండి... వుహాన్లో భారతీయ విద్యార్థులు
భారత్లో తొలి ‘కరోనా’కేసు నమోదు
గాంధీ ఆస్పత్రిలోనే ‘కరోనా’ పరీక్షలు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల వేడి.. రైళ్లు ప్రత్యేకమండి
వేసవి సెలవులు వచ్చాయంటే ప్రత్యేక రైళ్లు వేయడం పరిపాటే. కానీ ఈ సారి వాటికి తోడు ఎన్నికలు కూడా వచ్చాయి. -
డ్వాక్రా మహిళలే కీలకం!
జిల్లా వ్యాప్తంగా గ్రామం, వార్డు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ‘డ్వాక్రా స్వయం సహాయక సంఘాలు’న్నాయి. వీటిలో వేలాది మంది కొనసాగుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే?