బెంజిసర్కిల్‌ వంతెనపై అధికారిక ట్రయల్‌రన్‌

నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బెంజిసర్కిల్‌ వంతెనపై అధికారికంగా ట్రయల్‌రన్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌, నగర పోలీసు కమిషనర్‌

Published : 04 Feb 2020 00:49 IST

విజయవాడ: నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బెంజిసర్కిల్‌ వంతెనపై అధికారికంగా ట్రయల్‌రన్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌, నగర పోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు ట్రయల్‌ రన్‌ నిర్వహించిన అనంతరం వంతెనపైకి వాహనాలను అనుమతించారు. రూ.80కోట్ల వ్యయంతో 2017లో వంతెన నిర్మాణపనులను ప్రారంభించారు. 2.3కి.మీ మేర నిర్మాణాన్ని పూర్తి చేసి నగరవాసులతో పాటు వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని రోజులపాటు పైవంతెనపై వాహనాల రాకపోకలు పరిశీలించిన తర్వాత చిన్నపాటి లోటుపాట్లను సరిచేసి మార్చిలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 

నగరంలోని నోవాటెల్ హోటల్ నుంచి రామలింగేశ్వరనగర్ బ్రిడ్జి వరకు ఒకవైపు పూర్తయిన ఈ వంతెనతో ఏలూరు నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. 7 నుంచి 8 నెలలుగా జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులతో నిత్యం చర్చలు జరిపి  పైవంతెనను త్వరితగతిన వాహనదారులకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టామని కలెక్టర్ ఇంతియాజ్ వెల్లడించారు. పైవంతెనకు రెండు వైపులా వేగ నియంత్రికలు ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులకు సూచించినట్లు కలెక్టర్ తెలిపారు.

ఫొటోగ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని