కేంద్రమంత్రికి కుమారుడు ట్రిమ్మింగ్‌

కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌కు కుమారుడు ట్రిమ్మింగ్‌

Published : 12 Apr 2020 18:07 IST

వీడియో పంచుకున్న చిరాగ్ పాసవాన్‌

న్యూదిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో అందరూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్న కేంద్ర మంత్రి, బిహార్‌ నేత రాంవిలాస్‌ పాసవాన్ గడ్డం పెరిగిపోయింది. మరోవైపు క్షవరశాల(హేర్‌ సెలూన్‌)లు మూతబడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ ముందుకొచ్చి ట్రిమ్మర్‌తో గడ్డాన్ని ట్రిమ్‌ చేశారు. ఆదివారం ఈ వీడియోను చిరాగ్‌ ట్వీటర్‌లో పంచుకున్నారు. ‘నాకు ఈ నైపుణ్యం కూడా ఉందని ఇప్పటివరకు తెలియదు. ఇది కష్టకాలమే.. అయినా కరోనాపై పోరాడదాం. అలాగే మంచి జ్ఞాపకాలను సృష్టించుకుందాం’ అని వీడియోకు వ్యాఖ్యను చేర్చారు. దీనిపై నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. ‘ఇది అపురూపం. ఓ కుమారుడు తన తండ్రికి ట్రిమ్‌ చేస్తున్నాడు’ అని ఓ వ్యక్తి స్పందించారు. ‘నీలాంటి కుమారుడు ఉన్నందుకు మీ తండ్రి సంతోషంగా ఉండాలి’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని