TS RTC: టీఎస్‌ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పిన సజ్జనార్‌

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా మరో ...

Published : 03 Mar 2022 01:52 IST

హైదరాబాద్‌: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తాజాగా మరో ఆకర్షణీయమైన స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. 250 కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగా టికెట్‌ రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులు వారి ఇంటి వద్ద నుంచి బోర్డింగ్‌ పాయింట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్టు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. జంట నగరాల్లో ప్రయాణానికి 2గంటల ముందు, ప్రయాణం తర్వాత 2గంటల సమయం వరకు ఈ అవకాశం వర్తిస్తుందని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని