సరిహద్దుల్లో రెండు తేలికపాటి హెలికాప్టర్ల మోహరింపు
చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తాము తయారు చేసిన రెండు తేలికపాటి హెలికాప్టర్లను సరిహద్దుల్లోని లేహ్లో వైమానిక దళం మోహరించినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ప్రకటించింది.
లేహ్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో తాము తయారు చేసిన రెండు తేలికపాటి హెలికాప్టర్లను సరిహద్దుల్లోని లేహ్లో వైమానిక దళం మోహరించినట్లు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ప్రకటించింది. లేహ్లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఈ రెండు హెలికాప్టర్లు వైమానిక దళానికి సహాయకారిగా ఉంటాయని తెలిపింది. భారత భద్రతా బలగాల ప్రత్యేక అవసరాల కోసం రూపొందించిన ఈ హెలికాప్టర్లు ప్రపంచంలోనే అత్యంత తేలికపాటివని హెచ్ఏఎల్ వెల్లడించింది.
ఆత్మనిర్బర్ భారత్ కార్యక్రమంలో హెచ్ఏఎల్ పాత్రకు ఈ హెలికాప్టర్లు అద్దం పడతాయని పేర్కొంది. భారత వైమానిక దళానికి చెందిన పైలెట్ల బృందం తమ పైలెట్తో కలిసి లేహ్లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఈ హెలికాప్టర్లలో విహరించి పరీక్షించినట్లు హెచ్ఏఎల్ తెలిపింది. అత్యంత క్లిష్టమైన ప్రాంతంలో ల్యాండింగ్ కూడా చేసినట్లు వెల్లడించింది. అత్యంత శీతల వాతావరణంలో సైతం ఈ హెలికాప్టర్లను వేగంగా మోహరించినట్లు వివరించింది. శత్రు దేశానికి చెందిన ఎలాంటి లక్ష్యాన్నైనా రాత్రి, పగలు తేడా లేకుండా ఇవి కచ్చితంగా ఛేదించగలిగే ఆయుధ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు హెచ్ఏఎల్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం