Hyderabad: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్‌

పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు.

Published : 01 Jan 2024 14:30 IST

హైదరాబాద్‌: పారిశుద్ధ్య కార్మికులతో కలిసి భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశం నిర్వహించారు. వారితో కాసేపు ముచ్చటించిన కేటీఆర్.. కలిసి భోజనం చేశారు. కార్మికులతో సెల్ఫీలు దిగారు. జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త ఏడాదిని పురస్కరించుకొని కేటీఆర్‌ను కలిసి పలువురు భారాస ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని