కందికొండ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం: తలసాని

సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మరణించడం చాలా బాధాకరమని

Updated : 13 Mar 2022 11:51 IST

హైదరాబాద్‌: సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి మరణించడం చాలా బాధాకరమని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. తెలంగాణ సమాజం, ఉద్యమం కోసం గొప్ప పాటలు రాశారని చెప్పారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అన్నారు. కందికొండ కుటుంబానికి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని