Navy Day: సాగర తీరంలో సాహస విన్యాసాలు.. అట్టహాసంగా నేవీ డే
నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్ర ప్రతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరై తిలకించారు.
విశాఖపట్నం: నౌకాదళ దినోత్సవం (Navy Day) సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. ఐఎన్ఎస్ సింధు వీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ హరికుమార్, ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు విడదల రజని, గుడివాడ అమర్నాథ్, క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన నౌకాదళ గీతం ఆకట్టుకుంది. భారీగా తరలివచ్చిన సందర్శకులతో ఆర్కే బీచ్ జన సంద్రంగా మారింది.
నేవీ డే హైలైట్స్...
* జెమినీ బోట్లోకి హెలికాప్టర్ నుంచి దిగిన మెరైన్ కమాండోలు సముద్ర జలాలపై అత్యంత వేగంగా ఒడ్డుకు దూసుకొచ్చారు. జెమినీ బోట్ నుంచి నేరుగా హెలికాప్టర్లలోకి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ అటాక్ చేసేందుకు మెరైన్ కమాండోలు గాల్లోకి లేచారు.
* నౌకాదళ కమాండో బృందం నిర్వహించిన వాస్తవ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ఆహూతులను ఉత్కంఠకు గురి చేసింది.
* త్రివర్ణ పతాక రెపరెపలతో గగన వీధుల్లో హెలికాప్టర్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
* నీలి జలాలపై యుద్ధనౌకల జలాంతర్గాముల విన్యాసాలతో మెరైన్ కమాండోల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
* త్రివర్ణ ప్యారాచూట్లో దిగిన స్కై డైవర్ అనూప్ సింగ్ రాష్ట్రపతికి నౌకాదళ ప్రత్యేక ప్రచురణ ప్రతిని అందించి ఆవిష్కరింప జేశారు.
* సాహస విన్యాసాల కోసం ఎన్ఎస్ కంజీర్, కడ్మత్ నుంచి సముద్రంపై ఐఎన్ఎస్ దిల్లీ, ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకలు ఉపయోగించారు.
* గగన తలంలో చేతక్ హెలికాప్టర్ల సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. నాలుగు యుద్ధనౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు లాండింగ్, టేకాఫ్ అవడం ఆకట్టుకున్నాయి.
* మిగ్ 29 యుద్ధ విమానాలతో గగనతలంలో విన్యాసాలు చూపరులను గగుర్పాటుకు గురిచేశాయి.
* యుద్ధనౌకలు, సబ్ మెరైన్ల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ ఆకట్టుకుంది. రాత్రి వేళ సముద్రంపై విద్యుత్కాంతులీనుతూ యుద్ధనౌకలు అబ్బురపరిచాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం