ఈ పుస్తకం మనిషిని చంపేస్తుంది!
వాల్పేపర్స్.. ఇంటి గోడల్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంటాయి. కానీ, అవే వాల్పేపర్స్ ఒకప్పుడు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండేవట. వాటిపై అవగాహన లేక ప్రజలు వాటిని వినియోగించడం ఓ వైద్యుడికి ఆందోళన కలిగించింది. వెంటనే ఓ
ఇంటర్నెట్ డెస్క్: వాల్పేపర్స్.. ఇంటి గోడల్ని ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంటాయి. కానీ, అవే వాల్పేపర్స్ ఒకప్పుడు ప్రాణాలు తీసేంత ప్రమాదకరంగా ఉండేవట. వాటిపై అవగాహన లేక ప్రజలు వాటిని వినియోగించడం ఓ వైద్యుడికి ఆందోళన కలిగించింది. వెంటనే ఓ పుస్తకాన్ని రచించాడు. అందులోని పేజీలు తిరగేస్తే మరణించడం గ్యారెంటీ అని పేర్కొన్నాడు. వాల్పేపర్ ఏంటి? పుస్తకం ఏంటి? పేజీలు తిరగేస్తే మరణించడం ఏంటి? అని తికమకపడుతున్నారా..! అయితే ఇది చదవండి..
ఆర్సెనిక్ అనే రసాయన మూలకం ఎంతో ప్రమాదకరం. ఎక్కువమొత్తంలో ఇది మన శరీరంలోకి వెళ్తే ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఈ రసాయన మూలకంతో తయారు చేసిన వాల్పేపర్స్ను 1860 కాలంలో అమెరికాలో ప్రజలు ఇంట్లో అలంకరణ కోసం బాగా ఉపయోగించేవారు. ఆ వాల్పేపర్స్లో ఉన్న ఆర్సెనిక్.. గాలి ద్వారా లేదా వాల్పేపర్ను తాకడం వల్ల మనుషుల చేతుల నుంచి శరీరంలోకి వెళ్తే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ విషయాన్ని అమెరికా అంతర్యుద్ధం సమయంలో సర్జన్గా, ఆ తర్వాత రసాయన శాస్త్ర ప్రొఫెసర్గా మారిన డాక్టర్ రాబర్ట్ ఎం. కెడ్జె గుర్తించారు. మిచిగాన్ రాష్ట్రానికి చెందిన రాబర్ట్.. ఆర్సెనిక్తో తయారు చేసిన వాల్పేపర్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలని భావించారు. నోటి మాటతో చెబితే ఎవరు వింటారు అనుకున్నారేమో.. వినూత్నంగా ఓ పుస్తకం రచించారు. ఆర్సెనిక్ అధిక మోతాదులో కలిపి తయారు చేస్తున్న వాల్ పేపర్స్ను సేకరించి వాటితో 100కుపైగా పేజీలున్న ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. దానికి ‘షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్’ పేరు పెట్టారు.
ఆర్సెనిక్ వల్ల ప్రజల ప్రాణాలకు ఎలా ముప్పు పొంచి ఉందో పుస్తకంలో రాసుకొచ్చారు. అలాగే ఈ పుస్తకం మొదటి పేజీలోనే ఈ పుస్తకంలోని వాల్పేపర్స్కు ఆర్సెనిక్ ఉందని, పేజీలు తిరగేసే సమయంలో అది మనిషి శరీరంలోకి వెళ్లి ప్రాణాలు తీస్తుందని పేర్కొన్నారు. ఈ పుస్తకాన్ని 100 కాపీలు తీసి మిచిగాన్ వ్యాప్తంగా ప్రభుత్వ గ్రంథాలయాలకు పంపించారు. పుస్తకం రచించడానికి కారణాలు వివరిస్తూ.. ఆ పుస్తకాలను చిన్నారులకు దూరంగా ఉంచాలని కోరారు. రాబర్ట్ చెప్పిన విషయం నిజమేనని కొన్నాళ్లకు అందరికీ తెలిసింది. దీంతో గ్రంథాలయ నిర్వాహకులు ఆ పుస్తకాలను నాశనం చేశారు. దీంతో ప్రస్తుతం రాబర్ట్ రాసిన ‘షాడోస్ ఫ్రమ్ ది వాల్స్ ఆఫ్ డెత్’ పుస్తకం కాపీలు నాలుగు మాత్రమే ఉన్నాయి. రెండు మిచిగాన్లోని రెండు వేర్వేరు యూనివర్సిటీల్లో ఉన్నాయి. మరొకటి హార్వర్డ్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్లో, ఇంకొకటి యూఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ఉంది. కొన్నేళ్ల కిందట. ఈ పుస్తకాన్ని డిజిటల్ రూపంలోకి మార్చి ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం