జీవో నంబర్-1పై త్వరగా తేల్చండి: ఏపీ హైకోర్టుకు సుప్రీం సూచన
ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1 వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది..
దిల్లీ: ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్-1 వ్యవహారంపై దాఖలైన పిటిషన్ను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. తెదేపా నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సీజేఐ ధర్మాసనం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గతంలో ఈ కేసుపై ఏపీ హైకోర్టు విచారణ ముగించి తీర్పును వాయిదా వేసింది. తీర్పు జాప్యంపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. జనవరి నుంచి తీర్పు పెండింగ్లో ఉన్నట్లు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వీలైనంత త్వరగా తుదితీర్పు ఇవ్వాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని