Telangana News: పోలీసు శాఖలో 3,966 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Updated : 10 Dec 2022 19:24 IST

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా పోలీసు శాఖలో కొత్త పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సైబర్‌ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈమేరకు నియామకానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను మంత్రివర్గం ఆదేశించింది. డ్రగ్స్‌ నేరాల నివారణపై కేబినెట్‌ విస్తృతంగా చర్చించింది. పోలీస్‌ శాఖను మరింత బలోపేతం చేసేందుకు కొత్త పోలీస్‌ స్టేషన్లు, కొత్త సర్కిళ్లు, డివిజన్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని