HYD: అత్తాపూర్‌ మూసీలో మొసలి కలకలం

నగరంలోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌ మూసీలో మొసలి కలకలం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలకు భారీగా

Published : 10 Oct 2021 01:28 IST

హైదరాబాద్‌: నగరంలోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌ మూసీలో మొసలి కలకలం సృష్టించింది. నిన్న కురిసిన భారీ వర్షానికి జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. గండిపేట, హిమాయత్‌సాగర్‌ గేట్లు ఎత్తివేయడంతో మూసీలో వరద భారీగా ప్రవహిస్తోంది. ఈ వరదలో అత్తాపూర్‌కు మొసలి కొట్టుకొచ్చింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. గతంలో కిస్మత్‌పురాలో రెండు మొసలి కళేబరాలు గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. జూ అధికారులకు సమాచారం అందించినట్లు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని