Ganesh Nimajjanam: వీలైనంత త్వరగా నిమజ్జనానికి చర్యలు: డీజీపీ

భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గణేశుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా

Updated : 19 Sep 2021 13:15 IST

హైదరాబాద్‌: భాగ్యనగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ గణేశుడి నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా డీజీపీ మహేందర్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతోంది. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నాం. ప్రధాన ప్రాంతాల్లో ఉన్నతస్థాయి అధికారితో పర్యవేక్షిస్తున్నాం. పోలీస్‌ స్టేషన్లకు సీసీ టీవీ కెమెరాలు అనుసంధానం చేశాం. వీలైనంత త్వరగా నిమజ్జనం ముగిసేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని డీజీపీ చెప్పారు. మరోవైపు సరూర్‌నగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ను రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌ సందర్శించారు. గణేశ్‌ విగ్రహాల నిమజ్జనాలను పరిశీలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని