Narayanapet: నారాయణపేట జిల్లాలో ఉద్రిక్తత.. పోలీసు వాహనానికి నిప్పు

నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ వ్యర్థాల తరలింపుపై వివాదం నెలకొంది.

Published : 22 Oct 2023 13:54 IST

మరికల్‌: నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం చిత్తనూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగ్రో ఇథనాల్‌ కంపెనీ వ్యర్థాల తరలింపుపై వివాదం నెలకొంది. వ్యర్థాల తరలింపును చిత్తనూరు గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకు దిగిన గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. ఆగ్రహంతో గ్రామస్థులు పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మక్తల్‌ సీఐ రామ్‌లాకు గాయాలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని