Top Ten News @ ౫ PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. నవమి అల్లర్ల ఎఫెక్ట్.. హనుమాన్ జయంతికి కేంద్రం అడ్వైజరీ
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఇటీవల పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రేపటి (ఏప్రిల్ 6) హనుమాన్ జయంతి (Hanuman Jayanti) ఉత్సవాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ (MHA) ట్విటర్లో వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
2. ట్రంప్నకు రూ.కోటి చెల్లించండి.. శృంగార తారకు కోర్టు ఆదేశం
అనైతిక ఆర్థిక ఒప్పందం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్పై నమోదైన అభియోగాలపై న్యూయార్క్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో ట్రంప్పై వేసిన పరువునష్టం కేసులో మాత్రం డేనియల్స్కు మరోసారి చుక్కెదురయ్యింది. కాలిఫోర్నియాలోని 9వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్.. డేనియల్స్ వాదనను తోసిపుచ్చింది. దీంతో కోర్టు ఫీజులో భాగంగా ట్రంప్ తరఫు న్యాయవాదులకు లక్షా 20వేల డాలర్లు (సుమారు రూ.కోటి) చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
3. రాజకీయాల్లో చేరట్లేదు.. ఆ లేఖ ఎవరు పంపారో నాకు తెలుసు: సుదీప్
కన్నడ స్టార్ సుదీప్(Kiccha Sudeep) భాజపాలో చేరతారంటూ వస్తోన్న ఊహాగానాలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లో చేరడంలేదని.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బాజపా తరఫున ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు. బుధవారం బెంగళూరులో సీఎం బసవరాజ్ బొమ్మైతో ఆయన సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఈ సందర్భంగా సుదీప్ స్పష్టంచేశారు. కష్ట సమయంలో తనకు సీఎం బొమ్మై అండగా నిలిచారని.. ఇప్పుడు తాను ఆయనకు మద్దతుగా నిలబడతానన్నారు. భాజపా తరఫున ప్రచారం చేస్తానని చెప్పానే తప్ప ఎక్కడ నుంచీ తాను పోటీ చేయడంలేదన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
4. ప్రశ్నపత్రాల లీక్.. కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో భాజపా నేతలు చెలగాటమాడుతున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు’’ అని కేటీఆర్ మండిపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
5. మంత్రి బుగ్గనకు చేదు అనుభవం
నంద్యాల జిల్లా డోన్లో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన మాట్లాడుతుండగానే మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసరా చెక్కుల పంపిణీ కోసం డోన్లోని ఓ ఫంక్షన్ హాల్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున మహిళల్ని తరలించారు. ఎండ బాగా ఉండటం, కూర్చోవడానికి కుర్చీలు సహా కనీస సౌకర్యాలు లేకపోవడంతో మహిళలు ఇబ్బందిపడ్డారు. అధికారులు ఎంత చెప్పినా వినకుండా.. మంత్రి మాట్లాడుతుండగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
6. మెట్రోలో సీటు కోసం వివాదం..తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లిన మహిళ
మెట్రోరైల్లో సీటు కోసం తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి గురైన ఓ యువతి తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే...దిల్లీ(Delhi)లోని ఓ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఒకే వరుసలో కూర్చొని సీటు కోసం గొడవపడుతున్నట్లు వీడియోలో ఉంది. ఒక మహిళ తోటి ప్రయాణికురాలిపై కోపంగా అరుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహిళ బ్యాగులో నుంచి పెప్పర్ స్ప్రే తీసి ప్రయాణికురాలిని బెదిరింపులకు గురిచేసింది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
7. చాలా లోపాలు ఉన్నాయి.. ముంబయి ఫైనల్ చేరడం కష్టమే: సన్రైజర్స్ మాజీ కోచ్
గత ఐపీఎల్(IPL) సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్(Mumbai Indians).. ఈ సారి(IPL 2023) కూడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీని ఆరంభించింది. తొలి మ్యాచ్లో బెంగళూరు(Royal Challengers Bangalore)పై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పలువురు ఆ జట్టుపై ఇప్పటి నుంచే విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. సన్రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ(Tom Moody) కూడా ఆ జాబితాలో చేరాడు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఈ సారి కూడా రోహిత్ సేన(Rohit Sharma) ఫైనల్కు చేరడం కష్టమని జోస్యం చెప్పాడు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
8. రూ.52 వేలకే థాయ్లాండ్ టూర్.. IRCTC ‘థ్రిల్లింగ్’ ప్యాకేజ్!
థ్రిల్లింగ్ థాయ్లాండ్’ పేరిట ఐఆర్సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. ఈ యాత్ర మొత్తం ఐదు రాత్రులు, ఆరు పగళ్లు కొనసాగుతుంది. బిహార్లోని పట్నా విమానాశ్రయం నుంచి ఏప్రిల్ 25న టూర్ ప్రారంభమవుతుంది. తర్వాత వెళ్లాలనుకునేవారికి మే 26న కోల్కతా నుంచి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. స్వల్ప మార్పులు మినహా ఈ రెండు ప్యాకేజీలు దాదాపు ఒకేలా ఉన్నాయి. థాయ్లాండ్లో ప్రముఖ టూరిస్ట్ కేంద్రాలైన కోరల్ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్లో పలు సందర్శనీయ స్థలాలను వీక్షించొచ్చు. ఈ ప్యాకేజీలోనే ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం కూడా మిళితమై ఉంటాయి. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
9. లోదుస్తులు.. ఆర్థిక మాంద్యం.. వీటి మధ్య ఉన్న లింకేంటి?
ఒకదేశ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి అనేక కొలమానాలు అందుబాటులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయాదాయం, వృద్ధి రేటు, ప్రజల కొనుగోలు శక్తి.. ఇలా చాలా మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయొచ్చు. ఒక దేశం ఆర్థికంగా పురోగమిస్తుందా లేదా తిరోగమన దిశలో పయనిస్తుందా తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం. అయితే, పురుషుల లోదుస్తుల విక్రయాలు కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ (Economy) తీరుతెన్నులను బహిర్గతం చేస్తుందట. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమేనంటున్నారు నిపుణులు! మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
10. బ్రిటన్లో ఏమిటీ గ్రూమింగ్ గ్యాంగ్స్.. వాటిపై రిషి సునాక్ యుద్ధం దేనికి..?
బ్రిటన్(Britain)లో ‘గ్రూమింగ్ గ్యాంగ్స్’ (grooming gangs)పేరు వింటేనే బాలికల తల్లిదండ్రులు వణికిపోతారు. తమ బిడ్డలు ఈ తోడేళ్ల చెరలో చిక్కకూడదని కోరుకుంటారు. వీటిల్లో అధికంగా బ్రిటిష్ పాకిస్థానీల హస్తం ఉందని తాజాగా ఆ దేశ హోం మంత్రి సుయెలా బ్రావెర్మన్ నేరుగా బాంబు పేల్చారు. వీరి విషయంలో రాజకీయ పార్టీలు మౌనం పాటించాయని విమర్శించారు. మరోవైపు అంతకు ముందురోజే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) ఆ దేశంలోని ఆడపిల్లల తల్లిదండ్రులకు ఊరటనిచ్చేలా ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ను ఉక్కుపాదంతో అణచివేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే వీటిపై ఓ పోలీస్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
తూర్పు- పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి తాజా ఓటర్ల జాబితా రూపకల్పనకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. -
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసీ ప్రకటన
-
ఆ మెయిల్తో వచ్చే సమాచారం మేం పంపలేదు: మంచు విష్ణు నిర్మాణ సంస్థ
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్