IPL 2023: చాలా లోపాలు ఉన్నాయి.. ముంబయి ఫైనల్ చేరడం కష్టమే: సన్రైజర్స్ మాజీ కోచ్
ముంబయి ఇండియన్స్(Mumbai Indians) పేలవ ప్రదర్శనపై సన్రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ(Tom Moody) విమర్శలు గుప్పించారు. ఆ జట్టులో చాలా లోపాలు ఉన్నాయని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : గత ఐపీఎల్(IPL) సీజన్లో తీవ్రంగా నిరాశపరిచిన ముంబయి ఇండియన్స్(Mumbai Indians).. ఈ సారి(IPL 2023) కూడా పేలవ ప్రదర్శనతోనే టోర్నీని ఆరంభించింది. తొలి మ్యాచ్లో బెంగళూరు(Royal Challengers Bangalore)పై 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో పలువురు ఆ జట్టుపై ఇప్పటి నుంచే విమర్శలు చేయడం ప్రారంభిస్తున్నారు. సన్రైజర్స్ మాజీ కోచ్ టామ్ మూడీ(Tom Moody) కూడా ఆ జాబితాలో చేరాడు. ఇదే ప్రదర్శన కొనసాగిస్తే ఈ సారి కూడా రోహిత్ సేన(Rohit Sharma) ఫైనల్కు చేరడం కష్టమని జోస్యం చెప్పాడు.
‘ముంబయి జట్టు పేలవ ప్రదర్శనపై ఆందోళన చెందుతున్నాను. నేను ఐపీఎల్ ప్రారంభానికి ముందు కూడా ఇదే చెప్పాను. వారు ఫైనల్ వరకు చేరుకుంటారని నేను అనుకోవడం లేదు. రోహిత్ సేనలో చాలా లోపాలు ఉన్నాయి. జట్టు సమతుల్యత లోపించింది. మ్యాచ్లో అన్ని అన్ని స్థానాల్లో మెరుగ్గా బౌలింగ్ చేసే దేశీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు కరవయ్యారు. ఇక విదేశీ ఆటగాళ్ల విషయంలోనూ వారికి సమతుల్యత లేదు’ అని మూడీ ఓ ఛానల్తో ఆ జట్టు ప్రదర్శనపై విశ్లేషించాడు.
ఐదుసార్లు టైటిల్ విజేతగా నిలిచి ఛాంపియన్ జట్టుగా నిలిచిన ముంబయి ప్రదర్శన ఇటీవలి కాలంలో పేలవంగా ఉంటోంది. జట్టులో మ్యాచ్ విన్నర్లు ఉన్నప్పటికీ ఫలితం మాత్రం రావడం లేదు. ఇక ముంబయి తన తదుపరి మ్యాచ్లో చెన్నై జట్టుతో ఈ నెల 8న సొంత మైదానంలో తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?