Recession: లోదుస్తులు.. ఆర్థిక మాంద్యం.. వీటి మధ్య ఉన్న లింకేంటి?
Recession: దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల విక్రయాలు సంకేతాలు ఇస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఒకదేశ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి అనేక కొలమానాలు అందుబాటులో ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, స్థూల జాతీయాదాయం, వృద్ధి రేటు, ప్రజల కొనుగోలు శక్తి.. ఇలా చాలా మార్గాల ద్వారా ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అంచనా వేయొచ్చు. ఒక దేశం ఆర్థికంగా పురోగమిస్తుందా లేదా తిరోగమన దిశలో పయనిస్తుందా తెలుసుకోవడానికి ఇది చాలా కీలకం. అయితే, పురుషుల లోదుస్తుల విక్రయాలు కూడా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ (Economy) తీరుతెన్నులను బహిర్గతం చేస్తుందట. వినడానికి కొంత వింతగా ఉన్నా.. ఇది నిజమేనంటున్నారు నిపుణులు!
ఎలాగంటే..
దీన్ని తొలిసారి అమెరికా ఫెడరల్ రిజర్వ్ మాజీ ఛైర్మన్ అలెన్ గ్రీన్స్పాన్ సూత్రీకరించారు. పురుషుల లోదుస్తులు ఆర్థిక వ్యవస్థ (Economy) అంచనాకు చాలా కీలకమైన అంశమని ఆయన పేర్కొన్నారు. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు పురుషులు తమ లోదుస్తుల కొనుగోలును వాయిదా వేసుకుంటారట! వెంటనే పాతవాటిని మార్చడానికి అంతగా ఇష్టపడరని ఆయన వివరణ ఇచ్చారు. అదే రాబోయే ఆర్థికమాంద్యాన్ని (Recession) సూచిస్తుందని తెలిపారు.
భారత్లో 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కలవరానికి గురిచేసింది. అయినప్పటికీ.. లోదుస్తుల విక్రయాలు మాత్రం దెబ్బతినలేదు. కానీ, డిసెంబరుతో ముగిసిన త్రైమాసికం నాటికి పరిస్థితులు మారాయి. జాకీ, లక్స్ పేరిట లోదుస్తులను విక్రయిస్తున్న పేజ్ ఇండస్ట్రీస్ విక్రయాలు 11 శాతం పడిపోయాయి. ఈ కంపెనీ స్టాక్ విలువ ఐదు శాతం కుంగింది. రూప అండ్ కంపెనీ అమ్మకాల్లో 55 శాతం క్షీణత నమోదైంది. గత ఏడాది వ్యవధిలో రూప స్టాక్ విలువ 52 శాతం తగ్గింది. ఇలా వరుసగా పురుషుల లోదుస్తుల విక్రయాలు క్షీణిస్తే అలెన్ థియరీ ప్రకారం.. ఆర్థిక వ్యవస్థ (Economy)లో ఇబ్బందులు ఉన్నాయని అర్థం.
ఈ సూచీలూ అలాంటివే..
ఇదే తరహాలో లిప్స్టిక్ ఇండెక్స్ అని కూడా ఓ సూచీ ఉంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఖరీదైన అలంకరణ వస్తువుల కొనుగోలును ఆడవాళ్లు వాయిదా వేసుకుంటారట! వాటి స్థానాన్ని ఆకర్షణీయమైన లిప్స్టిక్ల ద్వారా భర్తీ చేసుకుంటారని ఆర్థిక నిపుణుల భావన! అంటే ఆర్థిక మాంద్యం (Recession) ముంచుకొచ్చే ముందు లిప్స్టిక్ల విక్రయాలు గణనీయంగా పెరుగుతాయట. దీన్ని లియోనార్డ్ లాడర్ అనే వ్యాపారవేత్త సూత్రీకరించారు. 2000లో వచ్చిన ఆర్థిక మందగమన సమయంలో లిప్స్టిక్ విక్రయాలు గణనీయంగా పెరగడం దానికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అయితే, 2008 ఆర్థిక మాంద్యం సమయంలో ఇది తప్పని తేలింది. ఆర్థిక మాంద్యం ముదిరిన కొద్దీ లిప్స్టిక్ విక్రయాలు పడిపోయాయి. దీంతో లిప్స్టిక్ ఇండెక్స్ ఆర్థిక వ్యవస్థ (Economy)ను అంచనా వేయడానికి ఇక ఏమాత్రం ఆధారం కాదని పలువురు నిపుణులు కొట్టిపారేశారు. అయితే, మహిళలు నెయిల్ పాలిష్కు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే లిప్స్టిక్ ఇండెక్స్ అంచనాలు తప్పాయని మరికొందరు వాదించారు. ఆ క్రమంలో ‘నెయిల్ పాలిష్ ఇండెక్స్’ను కూడా తెరపైకి తెచ్చారు. మరోవైపు కరోనా సమయంలో ‘మాస్కారా ఇండెక్స్’ అని కొత్త సూచీ వినిపించింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం చాలా మంది మాస్కులు ధరించిన విషయం తెలిసిందే. అయితే, ఆ సమయంలో కళ్లు మాత్రమే బయటకు కనిపిస్తుండడంతో వాటికి సంబంధించిన అలంకరణ వస్తువుల విక్రయాలు పెరిగాయట.
తొలి సంకేతాలు..
ఇవన్నీ ఆర్థిక వ్యవస్థ (Economy)కు సంబంధించిన కచ్చితమైన గణాంకాలను వెలువరించనప్పటికీ.. ప్రాథమిక సంకేతాలు మాత్రం చెబుతాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఆధారంగా చేసుకొని లోతైన అధ్యయనం జరపడానికి ఇవి దోహదం చేస్తాయని వివరిస్తున్నారు. అంటే ఇవి ఒక ‘ట్రిగ్గర్ పాయింట్’లా పనిచేస్తాయని వారి విశ్వాసం. 2009 ఆర్థిక మాంద్యం (Recession) సమయంలో అమెరికాలో 2007 నుంచే పురుషుల లోదుస్తుల విక్రయాలు గణనీయంగా పడిపోయాయట. తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం ప్రారంభం అయ్యాక 2010లో మళ్లీ విక్రయాలు పెరిగాయట. మరోవైపు కరోనాకు ముందు 2019లో అగ్రరాజ్యంలో ఆరు బిలియన్ డాలర్లు విలువ చేసే లోదుస్తులు విక్రయాలు జరిగాయని గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2020 నాటికి అవి 4.5 బిలియన్ డాలర్లకు కుంగాయి. దాదాపు 25 శాతం పడిపోయాయి. అదే 2021లో తిరిగి 22 శాతం పుంజుకొని 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి.
ద్రవ్యోల్బణాన్ని నివారించడం కోసం గత ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులన్నీ కీలక వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంతో ఆర్థిక వృద్ధి కుంటుపడుతూ వస్తోంది. 2023లో మూడోవంతు దేశాలు ఆర్థిక మాంద్యం (Recession)లోకి జారుకుంటాయని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ అంచనా వేసింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తే దాన్ని మాంద్యంగా వ్యవహరిస్తారు. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ (Economy) మాత్రం బలంగా ఉంటుందని ఇప్పటికే పలు నివేదికలు ఉద్ఘాటించాయి. కానీ, ఆర్బీఐ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాన్ని గమనిస్తే.. భారత్కు సైతం కొన్ని ఇబ్బందులు తప్పవనే విషయం స్పష్టమవుతోంది. మరి ఇటీవల భారత్లో తగ్గిన లోదుస్తుల విక్రయాలు అందుకు సంకేతమా? చూడాల్సి ఉంది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
Boult Soundbars: బౌల్ట్ హోమ్ ఆడియో డివైజ్ల రంగంలోకి ప్రవేశించింది. తాజాగా సౌండ్బార్లను ప్రవేశపెట్టింది. -
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128, నిఫ్టీ 37 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
Vivo V30e: మొబైల్ తయారీ కంపెనీ 3 ఏళ్లు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 సంవత్సరాలు సెక్యూరిటీ అప్డేట్స్తో కొత్త మొబైల్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. -
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
WhatsApp: ఇకపై వాట్సప్లో ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు. ఎవరెవరు వస్తారో కూడా తెలుసుకోవచ్చు. వారికి నోటిఫికేషన్ ద్వారా గుర్తు చేయొచ్చు. అందుకు అనుగుణంగా కమ్యూనిటీలో ఈవెంట్స్ అనే కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది వాట్సప్. -
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
ATM Scam: ఎప్పటికప్పుడు దుండగులు కొత్త రకం స్కామ్లకు తెరతీస్తున్నారు. తాజాగా ఏటీఎం మెషీన్లోని కార్డు రీడర్ను తొలగించి మోసాలకు పాల్పడుతున్నారు. -
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
Stock Market Opening bell: ఉదయం 9:19 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్ల లాభంతో 74,618 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 22,652 దగ్గర కొనసాగుతోంది. -
గోద్రేజ్ విభజన షేర్ల బదిలీతోనే.. ముంబయిలోని 3400 ఎకరాలు జెంషెడ్ వర్గానికి..
దేశంలోనే దిగ్గజ గ్రూప్లలో ఒకటిగా ఉండి, 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోవడం కార్పొరేట్ ప్రపంచంలో ఆసక్తిని పెంచుతోంది. -
వసూళ్లలో జైఎస్టీ (జీఎస్టీ)
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు తొలిసారిగా రూ.2 లక్షల కోట్ల మైలురాయిని తాకాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఇవి రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. 2023 ఏప్రిల్ నాటి రూ.1.87 లక్షల కోట్లతో పోలిస్తే, ఇవి 12.4% అధికం. -
వాహన దూకుడుకు ఎన్నికల ఆంక్షల పగ్గం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి నెల (ఏప్రిల్)లో టోకుగా 3.38 లక్షల ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు నమోదయ్యాయి. -
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ.5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. -
జిందాల్ స్టెయిన్లెస్ రూ.5,400 కోట్ల పెట్టుబడులు
జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ (జేఎస్ఎల్) వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 4.2 మిలియన్ టన్నులకు విస్తరించేందుకు రూ.5,400 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ ఎండీ అభ్యుదయ్ జిందాల్ బుధవారం వెల్లడించారు. -
ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ 8 నుంచి 10 వరకు
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్స్టోన్ పెట్టుబడులున్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈ నెల 8న ప్రారంభమై 10న ముగియనుంది. -
బేబీ పౌడర్తో క్యాన్సర్ ఆరోపణలు!
జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే)కు చెందిన అనుబంధ కంపెనీ తయారు చేస్తున్న బేబీ పౌడర్లోని టాల్కమ్ వల్ల అండాశయ క్యాన్సర్ రావొచ్చన్న ఆరోపణలను సెటిల్ చేసుకోవడానికి 25 ఏళ్లలో 6.48 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.54,000 కోట్లు) కట్టడానికి ఆ సంస్థ సిద్ధమైంది. -
లీజుదార్ల చేతికి గోఫస్ట్ 54 విమానాలు
విమానయాన సంస్థ గోఫస్ట్కు అద్దె (లీజ్) పద్ధతిలో ఇచ్చిన 54 విమానాలను వెనక్కి తీసుకునేందుకు లీజుదార్లకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వాటిని డీరిజిస్టర్ చేసింది. -
అదానీ పవర్ లాభంలో 48% క్షీణత
వ్యయాలు పెరగడంతో ఆర్థిక ఫలితాల్లో అదానీ పవర్ రాణించలేకపోయింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.2,737.24 కోట్లకు పరిమితమైంది. -
అదానీ విల్మర్ లాభంలో 67% వృద్ధి
ఫార్చ్యూన్ బ్రాండ్పై నూనెలు, ఇతర ఆహార ఉత్పత్తులు విక్రయించే ఎఫ్ఎమ్సీజీ సంస్థ అదానీ విల్మర్.. జనవరి- మార్చిలో రూ.156.75 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. -
మన్పసంద్పై సెబీ ఆంక్షలు
2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాల గణాంకాల్లో అవకతవకలు వెలుగు చూడటం, వాటిని తప్పుగా వెల్లడించినందుకు గాను మన్పసంద్ బేవరేజెస్, ఆ కంపెనీకి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులను మూడేళ్ల పాటు సెక్యూరిటీస్ మార్కెట్లలో పాల్గొనకుండా సెబీ నిషేధం విధించింది. -
సంక్షిప్త వార్తలు(7)
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్కు (ఏపీఎస్ఈజెడ్) ‘ఏఏఏ’ రేటింగ్ను కేర్ రేటింగ్స్ ఇచ్చింది. తద్వారా ఈ రేటింగ్ పొందిన తొలి దిగ్గజ ప్రైవేట్ మౌలిక రంగ సంస్థగా నిలిచినట్లు ఏపీఎస్ఈజెడ్ తెలిపింది. -
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
WhatsApp: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సప్ భద్రతాపరంగా కొత్త ఫీచర్ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. తెలియని వ్యక్తుల ఖాతాల నుంచి మెసేజ్లు రాకుండా తాత్కాలికంగా అడ్డుకోనుంది. -
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
కార్పొరేట్ ప్రపంచంలో మరో కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. అదే ఆఫీస్ పికాకింగ్. ఇంతకీ ఏమిటిది? ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది? -
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
బాంబే షేవింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ శంతను దేశ్పాండే సొంతిటిని కొనుగోలు చేయడం కంటే అద్దెంట్లో ఉండటమే బెటర్ అంటూ తన అభిప్రాయాన్ని ఓ పాడ్కాస్ట్లో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు