మెట్రోలో సీటు కోసం వివాదం..తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లిన మహిళ
దిల్లీలోని ఓ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు సీటు కోసం గొడవ పడగా.. ఆగ్రహానికి గురైన ఓ మహిళ తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లింది. సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
దిల్లీ: మెట్రోరైల్లో సీటు కోసం తలెత్తిన వివాదంలో ఆగ్రహానికి గురైన ఓ యువతి తోటి ప్రయాణికురాలిపై పెప్పర్ స్ప్రే చల్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్లితే..
దిల్లీ(Delhi)లోని ఓ మెట్రోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు ఒకే వరుసలో కూర్చొని సీటు కోసం గొడవపడుతున్నట్లు వీడియోలో ఉంది. ఒక మహిళ తోటి ప్రయాణికురాలిపై కోపంగా అరుస్తూనే ఉంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహిళ బ్యాగులో నుంచి పెప్పర్ స్ప్రే తీసి ప్రయాణికురాలిని బెదిరింపులకు గురిచేసింది. ప్రయాణికురాలు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా..బాటిల్ మూత తిప్పి స్ప్రే చల్లింది. తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్లిపోయింది. కొన్ని క్షణాల్లోనే ఆ వాసన కంపార్ట్మెంట్ అంతా వ్యాపించడంతో ఆ ఘాటుకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇదంతా వీడియో తీసిన ఓ వ్యక్తి ట్విటర్లో పోస్టు చేయడంతో దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ స్పందించింది. సంఘటన జరిగిన మెట్రో కోచ్ నంబర్ పంపమని ఆ వ్యక్తిని కోరింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రజా రవాణాలో ఇటువంటి గొడవలు జరగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ