Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...
1. ఇదిగో బెయిర్స్టో ఔట్.. అరెరె ‘శాండ్పేపర్’ తేవడం మరిచిపోయానే!
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య యాషెస్ సిరీస్ (Ashes Series) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈసారి ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి టెస్టు సందర్భంగా ఏదొక అంశం వివాదాస్పదమవుతూనే ఉంది. క్యాచ్లు, ఔట్ చేసిన తీరు, ఎంసీసీ సభ్యులే ఆసీస్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం చూశాం. ఇరుదేశాల అభిమానులు దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్లిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. ఎమర్జెన్సీ ల్యాండింగ్లో రన్వేపై దొర్లిన విమానం.. వీడియో వైరల్
కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఎయిర్పోర్టు నుంచి బయల్దేరిన ఓ విమానం (Aircraft) సాంకేతిక లోపంతో క్షణాల్లోనే వెనక్కి మళ్లింది. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం రన్వేపై అదుపుతప్పి ప్రమాదకరంగా దిగింది.. అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. KTR: 3 పంటలా.. 3 గంటలా..? రైతులు తేల్చుకోవాలి: KTR
రైతుల ఉచిత విద్యుత్కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్ నినాదం.. మూడు పంటలు. కాంగ్రెస్ విధానం.. మూడు గంటలు. భాజపా విధానం.. మతం పేరిట మంటలు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరిట మంటలు కావాలా? అనేది రైతులు తేల్చుకోవాలి. తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన తరుణమిది’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. kollywood: పాదయాత్ర ప్రారంభించనున్న స్టార్ హీరో విజయ్ ..!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) పాదయాత్రకు సన్నద్ధం అవుతోన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త తమిళనాట హాట్ టాపిక్గా మారింది. సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ ఈ న్యూస్ ప్రకంపనలు సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు కొన్ని జాతీయ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఉత్తరభారత్లో భారీ వర్షాలు.. 100 మందికిపైగా మృతి
ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతి చెందినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోనే 80 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. దీంతోపాటు ఆ రాష్ట్రంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. హిమాచల్ పర్వత ప్రాంతాల్లో దాదాపు 300 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. అమెరికాను బెదిరించి.. ఆపై క్షిపణి ప్రయోగం..
కొరియా ద్వీపకల్పం మరోసారి ఉద్రిక్తంగా మారింది. అమెరికాను బెదిరించిన మర్నాడే ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించింది. ఈ విషయాన్ని జపాన్, ఉత్తరకొరియా అధికారులు ధ్రువీకరించారు. ఈ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో బుధవారం ఉదయం పడింది. ఇది తూర్పు దిశగా కొంత సేపు పయనించి జపాన్ కాలమానం ప్రకారం ఉదయం 11.15 సమయంలో సముద్ర జలాల్లో పడింది. ఈ విషయాన్ని ఆ దేశ కోస్ట్గార్డ్ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. పంచాయతీ ఎన్నికల్లో దీదీ జోరు.. 34వేల స్థానాల్లో టీఎంసీ గెలుపు
పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. టీఎంసీ ఏకంగా 34,560 పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. మరో 705 చోట్ల ఆధిక్యంలో ఉంది.
తన ప్రధాన ప్రత్యర్థి భాజపా 9,621 స్థానాల్లో గెలిచి.. మరో 169 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. సంపద సృష్టితో పేదరికం పోగొట్టాలి: చంద్రబాబు
పూర్ టు రిచ్ అర్థం చేసుకోవడం కష్టమైనా ఆచరణలో ఇది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపా మినీ మేనిఫెస్టోలోని పూర్ టు రిచ్ విధానం వినూత్నమైందని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యమే పీ-4 విధానమన్నారు. మీడియాతో చంద్రబాబు చిట్చాట్ నిర్వహించారు. రాష్ట్రంలో పేదరికం ఉందన్నది ఎంత వాస్తవమో సంపద సృష్టి కూడా అంతే అవసరమన్నారు. పేదలకు ఇప్పుడు రోజుకు రూ.150 మాత్రమే వస్తోందని.. సంపద సృష్టి ద్వారా అది మార్చాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఎండీ, సీఈవో హత్య కేసులో హంతకులు మాజీ ఉద్యోగులే..
బెంగళూరు(Bengaluru)కు చెందిన ఓ కంపెనీ ఎండీ, సీఈవోను హత్య చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ కంపెనీని వీడి కొత్త కంపెనీ పెట్టిన మాజీ ఉద్యోగులే ఈ హత్య చేసినట్లు తేలింది. తమ కొత్త కంపెనీ కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొంటున్నారనే అక్కసుతోనే వారిని చంపినట్లు అంగీకరించారు. నగరంలోని అమృతహళ్లి పంపా లేఅవుట్లోని ‘ఎయిర్ ఆన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ సీఈఓ వినుకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. రేవంత్ క్షమాపణ చెప్పేవరకు కాంగ్రెస్ నేతలను తిరగనీయొద్దు: ఎమ్మెల్సీ కవిత
రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్ ఉండాలని భారాస ఎమ్మెల్సీ కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. ఉచిత విద్యుత్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని విద్యుత్సౌధ వద్ద భారాస (BRS) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భారాస నేతలు, కార్పొరేటర్లు పాల్గొని రేవంత్, కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
కార్పొరేషన్ల పరిధిలో రోడ్డు డివైడర్లపై ఉండే ఫ్లెక్సీలను తక్షణమే తొలగించాలని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. -
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
జీవో 317 వల్ల నష్టపోయిన ఉద్యోగులను గుర్తించి వారి వివరాలను వీలైనంత త్వరగా ఇవ్వాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. -
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్ఆర్ఎస్ అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. -
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసులో విచారణ కొనసాగుతోందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ కబ్జాలకు సంబంధించిన బాధితుల నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా అర్జీలు స్వీకరించారు. -
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. -
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు