Bengal Rural Polls: పంచాయతీ ఎన్నికల్లో దీదీ జోరు.. 34వేల స్థానాల్లో టీఎంసీ గెలుపు
Bengal rural polls: పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ సత్తా చాటింది. భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. అటు ప్రధాన ప్రత్యర్థి టీఎంసీకి భాజపా దరిదాపుల్లో కూడా రాలేకపోయింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal) గ్రామ పంచాయతీ ఎన్నికల్లో (Rural Polls) అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) హవా కొనసాగుతోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ భారీ విజయం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. 63వేల పంచాయతీల్లో టీఎంసీ ఏకంగా 34,560 పంచాయతీ స్థానాల్లో విజయం సాధించింది. మరో 705 చోట్ల ఆధిక్యంలో ఉంది. తన ప్రధాన ప్రత్యర్థి భాజపా (BJP) 9,621 స్థానాల్లో గెలిచి.. మరో 169 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. సీపీఎం 2,908 చోట్ల గెలిచి 86 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ (Congress) 2,515 స్థానాలను దక్కించుకుని 71 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది.
మూడంచెల పంచాయతీ వ్యవస్థ అమల్లో ఉన్న బెంగాల్లో మొత్తం 73,887 స్థానాలకు శనివారం ఎన్నికలు (Panchayat Elections) జరిగాయి. ఇందులో గ్రామ పంచాయతీలు 63,229 ఉన్నాయి. మిగిలిన వాటిలో 9,730 పంచాయతీ సమితులు, 928 జిల్లా పరిషత్తు సీట్లు ఉన్నాయి. మంగళవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలవ్వగా.. రేపు సాయంత్రానికి పూర్తి ఫలితాలు వచ్చే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.
- ఇదీ చదవండి: పాదయాత్ర ప్రారంభించనున్న స్టార్ హీరో విజయ్ ..!
ఇక, పంచాయతీ సమితుల్లో టీఎంసీ ఇప్పటికే 6,228 స్థానాలను దక్కించుకోగా.. మరో 218 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. భాజపా 960 సమితిల్లో గెలిచి.. మరో 50 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. మొత్తం 928 జిల్లా పరిషత్తు సీట్లలో తృణమూల్ 592 స్థానాలను కైవసం చేసుకుంది. మరో 188 చోట్ల ఆధిక్యంలో ఉంది. భాజపా కేవలం 18 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. మరో 9 చోట్ల ముందంజలో ఉంది.
మరో ముగ్గురి మృతి..
మరోవైపు, కౌంటింగ్ సమయంలోనూ బెంగాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించగా.. ఓ పోలీసు అధికారి గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
బెంగాల్లో గత శనివారం పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల నేపథ్యంలో కొన్ని చోట్ల పోలింగ్ను నిలిపివేశారు. అలా 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం రీపోలింగ్ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా