Ashes Series: ఇదిగో బెయిర్స్టో ఔట్.. అరెరె ‘శాండ్పేపర్’ తేవడం మరిచిపోయానే!
యాషెస్ సిరీస్ (Ashes Series) ప్రభావం ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా ప్రధానులపైనా పడింది. సందర్భం వచ్చినప్పుడల్లా స్పందిస్తూ నెట్టింట వైరల్గా మారుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా (ENG vs AUS) జట్ల మధ్య యాషెస్ సిరీస్ (Ashes Series) ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈసారి ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతి టెస్టు సందర్భంగా ఏదొక అంశం వివాదాస్పదమవుతూనే ఉంది. క్యాచ్లు, ఔట్ చేసిన తీరు, ఎంసీసీ సభ్యులే ఆసీస్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం చూశాం. ఇరుదేశాల అభిమానులు దాడులు చేసుకునే స్థాయికి కూడా వెళ్లిపోయారు. అదే విధంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్రధానులు కూడా మాటల యుద్ధానికి దిగారు. తాజాగా మరోసారి ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్ ‘నాటో’ సమ్మిట్లో భాగంగా యాషెస్పైనా చర్చించారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధాని ట్విటర్ వేదికగా వీడియోను పోస్టు చేశారు.
‘‘నాటో సమ్మిట్లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, యూఎస్ఏ (AUKUS) కూటమి భద్రత, సాంకేతికత మార్పిడి, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడం, ఆసీస్-యూకే వాణిజ్య అగ్రిమెంట్ తదితర అంశాలను ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్తో చర్చించా. అదే క్రమంలో మేమిద్దరం యాషెస్ సిరీస్ గురించి కూడా చర్చించుకున్నాం’’ అని అల్బానీస్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం మూడు టెస్టులు ముగిసేసరికి ఆసీస్ 2-1 ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.
వీడియోలో ఇలా..
తొలుత ఆసీస్ ప్రధాని తమ జట్టు 2-1 ఆధిక్యంలో ఉందంటూ ప్లకార్డును ప్రదర్శించగా.. లీడ్స్ టెస్టులో ఇంగ్లాండ్ గెలిచిందంటూ రిషి సునాక్ ప్రతి స్పందించారు. దీంతో వెంటనే జానీ బెయిర్స్టో ఔట్ను ప్రస్తావిస్తూ ఆసీస్ ప్రధాని మరో పేపర్ను చూపించారు. అయితే, రిషి సునాక్ నవ్వుతూనే ‘నేను శాండ్ పేపర్ను తీసుకురావడం మరిచిపోయా’ అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో ఆసీస్ ప్రధాని కూడా సునాక్తో కలిసి నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఇద్దరూ కరచాలనం చేసుకుని భేటీని ముగించారు.
అసలేంటీ శాండ్పేపర్ స్కాండల్
రిషి సునాక్ ప్రస్తావించిన ‘శాండ్ పేపర్’ వివాదం ఐదేళ్ల కిందట జరిగింది. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా ఆసీస్ ఆటగాడు కామెరూన్ బాన్క్రాఫ్ట్ శాండ్పేపర్ ముక్కతో బంతిని రుద్దడం టీవీల్లో కనిపించింది. స్వింగ్కు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఉన్నట్లుగా తేలడంతో వారిపై ఏడాదిపాటు నిషేధం పడింది. అలా చేసిన బాన్క్రాఫ్ట్పై 9 నెలల నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. ఆ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లోనూ స్టీవ్ స్మిత్ ఏడుస్తూ కనిపించాడు. కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు స్మిత్ ప్రకటించాడు. స్మిత్, డేవిడ్ వార్నర్ తిరిగి జాతీయ జట్టులోకి రాగా.. బాన్క్రాఫ్ట్ మాత్రం స్థానం దక్కించుకోలేకపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే