తెలంగాణలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 4,241 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Updated : 27 Mar 2021 10:28 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 4,241 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పది రోజుల కిందట వీటి సంఖ్య 2,101గా ఉండేది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 58,029 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 495 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,05,804కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1685కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 247 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,99,878కి చేరింది. 4,241 యాక్టివ్‌ కేసుల్లో 1,616 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 142 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 99,61,154కి చేరింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని