Vizag steel:ముగిసిన విశాఖ ఉక్కు బిడ్ల గడువు.. ఆసక్తి చూపిన 29 సంస్థలు

వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరకు కోసం విశాఖ ఉక్కు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) బిడ్ల దాఖలుకు గురువారంతో గడువు ముగిసింది. 

Published : 20 Apr 2023 17:37 IST

విశాఖపట్నం: వర్కింగ్‌ క్యాపిటల్‌, ముడిసరకు కోసం విశాఖ ఉక్కు ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) బిడ్ల దాఖలుకు గురువారంతో గడువు ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఏడు విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని కార్మిక సంఘం నేత అయోధ్యరామ్‌ తెలిపారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్టు సమాచారం లేదన్నారు. ఎన్‌ఎండీసీ వంటివి కూడా  ఈవోఐ దాఖలు చేయలేదని అయోధ్యరామ్‌ వెల్లడించారు. తొలుత నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం.. శనివారంతో గడువు ముగిసినప్పటికీ ఆర్‌ఐఎన్‌ఎల్‌ మరో ఐదు రోజులు (గురువారం వరకు) గడువు పొడిగించింది.  దీంతో ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు బిడ్డింగ్‌ గడువు ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని